బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ
కన్నెపల్లి, జనవరి 18 : పేద కుటుంబాల కోసం సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పెద్దన్నలా ఆదుకుంటున్నాడని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కొనియాడారు. మంగళవారం కన్నెపల్లిలోని రైతు వేదికలో మండలంలోని 41 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం లబ్ధిపొందుతున్నదని తెలిపారు. కరోనా సంక్షోభంలో సైతం పేద యువతుల తల్లిదండ్రులు ఇబ్బంది పడవద్దని కల్యాణలక్ష్మి పథకానికి పెద్ద ఎత్తున నిధులను ప్రభుత్వం కేటాయిస్తున్నదని తెలిపారు. రాష్ట్రంలోని అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికే బురద చల్లుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సత్యనారాయణ, తహసీల్దార్ రాంచందర్, ఎంపీడీవో శంకరమ్మ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ ఆకుతోట రాజన్న, రైతు బంధు సమితి చైర్మన్ శ్రీరామరావు, వైస్ ఎంపీపీ రాకేశ్ శర్మ, కన్నెపల్లి సర్పంచ్ సురేఖ, ఎంపీటీసీ నెండుగూరి భారతి, వర ప్రసాద్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. భీమినిలోని ఎంపీడీవో కార్యాలయంలో 24 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోతురాజుల రాజేశ్వరి, రైతు బంధు సమితి చైర్మన్ బోనగిరి ఓం ప్రకాశ్, ఎంపీటీసీ సురేశ్, ఎంపీడీవో జవహర్లాల్, టీఆర్ఎస్ నాయకులు పోతురాజుల లక్ష్మణ్, ఎంపీటీసీలు, సర్పంచ్ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో..
బెల్లంపల్లిటౌన్, జనవరి 18 :బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్తో కలిసి ఎమ్మెల్యే చిన్నయ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు గడ్డం అశోక్గౌడ్, షేక్ అఫ్సర్, కొమ్ముల సురేశ్, నీలి కృష్ణ, తహసీల్దార్ కుమారస్వామి, కోదండ రామాలయం కమిటీ చైర్మన్ రేణికుంట్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.