పీసీసీఎఫ్ కాంఫా అధికారి లోకేశ్ జైస్వాల్, ఎఫ్డీపీటీ వినోద్ కమార్
ఆకొండపేట గడ్డిక్షేత్రం పరిశీలన
దస్తురాబాద్, డిసెంబర్17 : మండలంలోని ఆకొండపేట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతం లో ఉన్న గడ్డి క్షేత్రాన్ని మరింత అభివృధ్ధి చేస్తామ ని పీసీసీఎఫ్ కాంఫా అధికారి లోకేశ్ జైస్వాల్, ఎఫ్డీపీటీ కవ్వాల్ టైగర్ జోన్ అధికారి వినోద్ కుమా ర్ పేర్కొన్నారు. ఆకొండపేట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న గడ్డి క్షేత్రాన్ని శుక్రవారం వారు పరిశీలించారు. అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను తిలకించారు. గడ్డి క్షేత్రం పెంపకంపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. గడ్డిక్షేత్రం అభివృధ్ధిపై పలు సూచనలు చేశారు. ఆకొండపేట గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న గడ్డి క్షేత్రానికి చుట్టూ కంచెను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అక్కడికి రకరకా ల పక్షులు, జంతువులు వస్తున్నట్లు తెలిపారు. గడ్డి క్షేత్రాన్ని అభివృద్ధి చేసేందుకు మరిన్ని నిధులు కేటాయించి అందంగా తీర్చిదిద్దుతామన్నారు. సందర్శనకు ప్రజలు, ప్రకృతి ప్రేమికులను అనుమతిస్తామని తెలిపారు. టూరిజం కోసం రోడ్డు కూడా వేసినట్లు పేర్కొన్నారు. ఇక్కడ పలు రకాల బోర్డులు ఏర్పాటు చేయాలని అటవీ శాఖ అధికారులకు సూచించారు. వారి వెంట మంచిర్యాల డీ ఎఫ్వో శివానీ డోగ్రే, ఖానాపూర్ ఎఫ్డీవో కోటేశ్వర రావు, ఎఫ్ఆర్వో అనిత, డీఆర్వోలు లక్ష్మీనారాయణ, మమత, పోషలింగం, ఎఫ్బీవోలు, సిబ్బంది ఉన్నారు.