ఎదులాపురం, డిసెంబర్ 17 : వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ సమయంలో ప్రజలకు అనేక సేవ లు అందించారని, ప్రస్తుతం వారు విరమణ పొం దిన తర్వాత ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పెన్షనర్ భవనంలో శుక్రవారం పెన్షనర్ డేను ఘనంగా ని ర్వహించారు. ముందుగా పెన్షనర్ పితామహుడు డీఎస్ నకార చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు. ఇందులో భాగంగానే విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుందని పేర్కొన్నారు. వారి ఆరో గ్య పరిస్థితులను బట్టి వెల్నెస్ సెంటర్ను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసి ఓపీ సేవలు అందించామని తెలిపారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న విశ్రాంత ఉద్యోగుల భవన నిర్మాణానికి రూ.5 లక్షలు ఇస్తారని హామీ ఇచ్చారని గుర్తుచేశా రు. మున్సిపల్ కార్యాలయంలో వృద్ధుల కోసం ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేశామని పేర్కొన్నా రు. పట్టణంలో ప్రస్తుతం వివిధ చౌక్లలో అభివృద్ధి పనులు సాగుతున్నాయని తెలిపారు. పట్టణాభివృద్ధికి అందరూ సహకారం అందించాలని కోరారు. అనంతరం విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే లక్ష్మారెడ్డి, పీ కిష్టయ్య మాట్లాడుతూ.. విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం అందరూ ఐక్యంగా ఉండాలని కోరారు. విశ్రాంత ఉద్యోగుల కోసం జీవిత ప్రమాణ పత్రాన్ని కార్యాలయంలో పొందవచ్చని తెలిపారు. టీడీవోలో ఎలాంటి సమస్యలున్నా ఇబ్బందికి గురిచేయకుండా వారికి సహకారం అందించాలని సూచించారు. అనంతరం మున్సిపల్ చైర్మన్ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు, వెల్సెన్ వైద్యులు, సీనియర్ సిటిజన్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కస్తాల సుధాకర్, ఏటీవో రమేశ్, సీనియర్ అసిస్టెంట్ మల్లేశ్, పట్టణ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎన్.నర్సయ్య, ఎస్.నర్సింగ్, సభ్యులు రుక్మారెడ్డి, అడెల్లు, నందయ్య, కిషన్, గంగాధర్, భాస్కర్, విఠల్, లింగయ్య, కరీం, హన్మంత్రెడ్డి, మధుకర్ పాల్గొన్నారు.