బోథ్, డిసెంబర్ 17: హరితహారం కార్యక్రమంలో నాటిని మొక్కలను రక్షించాలని ఎంపీడీవో రాథోడ్ రాధ సూచించారు. మండలంలోని వజ్జర్, కేశవ్గూడ, చింతల్బోరి, దేవుల్నాయక్ పంచాయతీలను శుక్రవారం సందర్శించారు. వజ్జర్లో కొవిడ్ వ్యాక్సినేషన్ను డాక్టర్ కే నవీన్రెడ్డితో కలిసి పరిశీలించారు. వజ్జర్ పంచాయతీలో రెండో డోసు వ్యాక్సినేషన్ 80 శాతం పూర్తి చేయడంపై అభినందించారు. దేవులనాయక్తండా నర్సరీలో మొక్కలకు నీళ్లు పట్టారు. కార్యక్రమంలో ఏపీవో శ్యాం, సర్పంచ్ సకారాం, మనోహర్ పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, డిసెంబర్ 17 : హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ కాపాడాలని ఎంపీపీ పంద్ర జైవంత్రావు అన్నారు. వాటర్ డే సందర్భంగా మండలంలోని ఘన్పూర్లో మొక్కలకు శుక్రవారం నీరుపోశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడారు. కార్యక్రమంలో సర్పంచ్ పంద్ర లత, కార్యదర్శి కిరణ్, సిబ్బంది ఉన్నారు.
నార్నూర్, డిసెంబర్ 17 : హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ బతికించాలని ఎంపీడీవో రమేశ్ పంచాయతీ కార్మికులకు సూచించారు. మండలంలోని జామాడ సమీపంలోని ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను శుక్రవారం పరిశీలించారు. ఆయన వెంట ఈజీఎస్ ఏపీవో జాదవ్ శే షారావ్,సర్పంచ్ మడావి ముక్తారూప్దేవ్ ఉన్నారు.
ఇంద్రవెల్లి, డిసెంబర్17 : మండలంలోని హీరాపూర్ పంచాయతీ పరిధిలోని రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలకు శుక్రవారం పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీరు పోశారు. మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు.