ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
ఎదులాపురం, జనవరి 17 : పేదల సమస్యలు పరిష్కరించడమే తమ ధ్యేయమని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. ఆదిలా బాద్ కలెక్టరేట్లోని చాంబర్లో సోమవారం సమ స్యలపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదా రుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. భూ సమస్యలు, ఉపాధి కల్పన, వితంతువులకు ఉపా ధి అవకాశాలు, కారుణ్య నియామకాలు, తదితర అంశాలకు సంబంధించిన అర్జీలను కలెక్టర్ స్వీక రించారు. భూ సమస్యలు మీసేవ కేంద్రాల ద్వారా ధరణి పోర్టల్లో నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏదైనా ఉపాధి కల్పిం చాలని ఊట్నూర్ మండలానికి చెందిన వితంతు వు లక్ష్మి కోరారు. ఇంటర్ పాస్ అయ్యానని, ఏదైనా చిన్న ఉద్యోగం ఇప్పించాలని షెడ్యూల్డ్ కులానికి చెందిన అంపల్లి జ్యోతి కోరారు. కారు ణ్య నియామకాలకు సంబంధించిన వాటిపై ప్రభు త్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుం టామ ని కలెక్టర్ పేర్కొన్నారు. ట్రైకార్ రుణాలకు బ్యాంకు అధికారులు సంబంధిత అధికారుల నుంచి ధ్రువీ కరణ పత్రాలు అడుగుతున్నారని పలువురు కలెక్ట ర్కు విన్నవించారు. కొవిడ్ నిబంధనల వల్ల ప్రజా వాణి నిర్వహించలేకపోయినా వివిధ అర్జీదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆయా శాఖల అధికా రులతో చర్చిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
అర్హులు వ్యాక్సిన్ తీసుకోవాలి
అర్హులు వ్యాక్సిన్ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 98.61 శాతం మొదటి డోస్, 71.65 శా తం రెండో డోస్, 15-18 ఏళ్ల వయస్సు గల వారి కి 46.16శాతం, 60 ఏళ్లు పైబడిన, ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ 67.25 శాతం మందికి అందించారని పేర్కొన్నారు. కలెక్టరేట్లోని రెవె న్యూ సిబ్బంది, ఫ్రంట్ లైన్ వర్కర్స్కు బూస్టర్ డోస్ అందించేందుకు వ్యాక్సిన్ కేంద్రాన్ని ఏర్పా టు చేసినట్లు తెలిపారు. ఆర్డీవో రాజేశ్వర్, కలెక్టరే ట్ పర్యవేక్షకుడు వర్ణ, వివిధ విభాగాల సిబ్బంది, రెవెన్యూ, ట్రెజరీ తదితర శాఖల సిబ్బంది టీకా తీసుకున్నారు. ఉట్నూర్ ఐటీడీఏ కార్యాలయంలో ప్రాజెక్టు అధికారి అంకిత్, ఇతర సిబ్బంది వ్యాక్సి న్ తీసుకున్నారు.