నోటా(నన్ ఆఫ్ ది ఎబో).. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరూ నచ్చనప్పుడు ఓటు వేయడానికి వీలుగా శాశ్వత పరిష్కారం కోసం చూపించిన ఆప్షన్. తద్వారా ఓటరు తమ అసమ్మతిని తెలుపడంతోపాటు ఓటు హక్కును వినియోగించుకున్న వారవుతారు. తాజాగా జరిగిన అసెంబీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 17,327 మంది నోటా నొక్కారు. ఇందులో బోథ్ నియోజకవర్గంలో 2,565.. ఆదిలాబాద్లో 592 మంది వినియోగిం చుకున్నారు. 2018లో 20,254 మంది ఈ ఆప్షన్కు ఎంచుకోగా.. ఈసారి నోటా చాయిస్ తీసుకున్నవారి సంఖ్య తగ్గింది.
– మంచిర్యాల, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నోటాకు 17,327 ఓట్లు పడ్డాయి. ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు చాలా విలువైంది. వజ్రాయుధం లాంటి ఓటు ను తప్పకుండా వినియోగించుకోవాలి. సరైన పాలకులను ఎన్నుకోవాలి. అది వంద శాతం పక్కాగా జరగలేని పక్షంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు అర్థం లేకుండా పోతుంది. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చనప్పుడు ఎవరో ఒకరికి ఓటు వేయడం, ఎవరూ నచ్చలేదని ఓటు వేయడానికి వెళ్లకుండా ఉండిపోవడానికి శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో తీసుకువచ్చిందే ఈ నోటా(నన్ ఆఫ్ ది ఎబో) ఆప్షన్. ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చనప్పుడు నోటా ఆప్షన్కు ఓటేయెచ్చు. తద్వారా ఓటరు తమ అసమ్మతిని తెలపడంతోపాటు ఓటు హక్కును వినియోగించుకున్న వారవుతారు.
కొన్ని సందర్భాల్లో ఇవ్వే గెలుపు ఓటములను డిసైడ్ చేస్తాయి కూడా. ఈ ఎన్నికల్లో అలా నోటాకు అనే ఆప్షన్ను ఎంచుకొని ఓటేసినోళ్లు వేలాది మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో అత్యధికంగా బోథ్ నియోజకవర్గంలో 2,565 మంది ఈ ఆప్షన్ను ఎంచుకున్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో 2,196 మంది, బెల్లంపల్లిలో 2,179 మంది, ఖానాపూర్లో 2,114 మంది నోటాకు ఓటేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 17,035 మంది నోటాకు ఓటేస్తే 2018లో 20,254 మంది ఈ ఆప్షన్కు ఎంచుకున్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి నోటా చాయిస్ తీసుకున్నవారి సంఖ్య తగ్గింది. పది నియోజకవర్గాల్లో మొత్తంగా 17,327 మంది నోటాను ఎంచుకున్నారు. నియోజకవర్గాలవారీగా నోటాకు ఓటు వేసిన వారి వివరాలిలా ఉన్నాయి.