సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
73 మంది లబ్ధిదారులకు చెక్కుల అందజేత
కాగజ్నగర్ రూరల్, సెప్టెంబర్16 : దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. క్యాంప్ కార్యాలయంలో ఎస్సీ రుణాల సబ్సిడీ చెక్కులను లబ్ధిదారులకు గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని 73 మందికి రూ. 20 వేల చొప్పున రూ. 1,46,000 మంజూరయ్యాయన్నారు. లబ్ధిదారులు సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
కౌటాల, సెప్టెంబర్ 16: మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మంజూరైన 11 మందికి రూ. 20 వేల రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సజీవన్, ఎంపీడీవో నస్రుల్లా ఖాన్, ఎంపీవో శ్రీధర్ రాజు, జూనియర్ అసిస్టెంట్ పెంటు, కార్పొరేషన్ సిబ్బంది శ్రీకాంత్, సర్పంచ్ మౌనిశ్, ఉపసర్పంచ్ తిరుపతి, నాయకులు రవీందర్ గౌడ్, శ్రీనివాస్, సంతోష్, అశోక్, పున్నయ్య, రాంచందర్, మధుకర్ ఉన్నారు.
సిర్పూర్(టీ), సెప్టెంబర్ 16 : మండలకేంద్రంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ ఆవరణలో ప్రజాప్రతినిధులు ఐదుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రమాకాంత్కూ రూ. 19వేలు, విజయ్కు రూ.34 వేలు, మం దాబాయికి రూ.11 వేలు, శంకర్కు రూ.60 వేలు, రాజుకు రూ.24 వేలు మంజూరయ్యాయి. కార్యక్రమంలో మండల కో ఆప్షన్ సభ్యుడు కీజర్హుస్సేన్, ఉప సర్పంచ్ తోట మహేశ్, నాయకులు అకీల్ అహ్మద్, ఇఫ్పాత్, ప్రసాద్, తక్కళ్ల తిరుపతి, పిప్రె రాందాస్, మొయిజ్, తదితరులు పాల్గొన్నారు.