ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 319 కేంద్రాలు
పట్టణాల్లో వార్డులు, గ్రామాల్లో సబ్ సెంటర్స్లో పంపిణీ
అర్హులందరికీ వ్యాక్సిన్.. కలెక్టర్ పర్యవేక్షణ..
ఆదిలాబాద్, సెప్టెంబరు 16 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కరోనా మహమ్మారి కట్టడికి సర్కారు నడుం బిగించింది. ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులు, 45 ఏండ్ల పైవారికి మొదటి, రెండో డోసు టీకాలు వేయగా.. 18 ఏండ్లు నిండినవారికి కూడా వేయడానికి ప్రణాళికలు రూపొందిం చింది. ఈ మేరకు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో గురువారం నుంచి మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ను ప్రారంభించింది. పట్టణాల్లో ప్రతి వార్డు, గ్రామాల్లోని వైద్యశాఖ సబ్సెంటర్లలో వేస్తున్నారు. వైద్యశాఖ సిబ్బందితోపాటు పంచాయతీ, అంగన్వాడీ, మెప్మా, డీఆర్డీవో సిబ్బంది అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూస్తున్నారు. రెండు జిల్లాల్లో 319 కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇందులో ఆదిలాబాద్లో 175, నిర్మల్లో 144 సెంటర్స్ ఉన్నాయి. ఇప్పటివరకు ఆదిలాబాద్ జిల్లాలో 1,74,396 మందికి, నిర్మల్ జిల్లాలో 1,92,249 మందికి వ్యాక్సిన్ వేశారు. కలెక్టర్ల పర్యవేక్షణలో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతుండగా.. అర్హులందరూ టీకా తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.
కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో కేసుల సంఖ్య బాగా తగ్గింది. రోజూ ఒకటి నుంచి నాలుగు కేసుల వరకు మాత్రమే నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు అధికారులు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించేలా చూస్తున్నారు. అనుమానితులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నారు. అదేవిధంగా రెండు జిల్లాల్లో వ్యాక్సినేషన్ సైతం ముమ్మరంగా కొనసాగుతోంది. జిల్లా దవాఖానలు, కమ్యూనిటీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 18 ఏళ్లు నిండిన వారిందరికీ టీకాలు ఇస్తున్నారు. వ్యాక్సినేషన్ను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కలెక్టర్ల పర్యవేక్షణలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. ఇందులో వైద్యశాఖ, పంచాయతీ, అంగన్వాడీ, మెప్మా, డీఆర్డీవో సిబ్బంది అర్హులైన వారందరూ వ్యాక్సిన్ తీసుకునేలా చూస్తారు.
రెండు జిల్లాల్లో 319 టీకా కేంద్రాలు..
మెగా వ్యాక్సినేషన్లో భాగంగా వైద్యశాఖ అధికారులు ఆదిలాబాద్ జిల్లాలో 175, నిర్మల్ జిల్లాలో 144 మొత్తం 319 కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు వ్యాక్సిన్ తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 1,74,396 మందికి, నిర్మల్ జి ల్లాలో 1,92,249 మందికి టీకా వేశారు. పట్టణ ప్రాంతాల్లో వార్డులను యూనిట్గా, గ్రామీణ ప్రాంతాల్లో వైద్యశాఖ సబ్సెంటర్ యానిట్గా ప్రక్రియ కొనసాగుతున్నది. పంచాయతీ, మెప్మా, అంగన్వాడీ, డీఆర్డీవో సిబ్బంది పట్టణాలు, గ్రా మాల్లో ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. అర్హులైన వారిని సెంటర్కు తీసుకెళ్లి టీకా ఇప్పిస్తారు. వైద్యశాఖ ఏఎన్ఎంలు, నర్సులతో పాటు జిల్లా దవాఖానల్లో సిబ్బంది సైతం వ్యాక్సిన్ సేవలు అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి కేంద్రంలో ప్రతిరోజూ 100 మందికి టీకా ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్యశాఖ అధికారులు తెలిపారు. రెండు జిల్లాలో రో జు 30 వేల మందికి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పట్టణంలోని భుక్తాపూర్, ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి కేంద్రాలను పరిశీలించారు. నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ ముథో ల్, లోకేశ్వరం మండలాల్లో టీకా పంపిణీని పరిశీలించారు. 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ వేయాలని సూచించారు.
అర్హులందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి..
మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్లో అర్హులైన వారందరూ టీకా తీసుకోవాలి. పట్టణాలు, గ్రా మాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే లా కేంద్రాలను ఏర్పాటు చేశాం. ఆదిలాబాద్లో 49 వార్డులతో పాటు గ్రామాల్లో సబ్సెంటర్లో వైద్యసిబ్బంది వ్యాక్సిన్ ఇస్తారు. వందశాతం టీకా వేసేలా చర్యలు తీసుకుంటున్నాం.