ఆదిలాబాద్ రూరల్, జనవరి 16 : జిల్లాలో క్రీడాకారులను ప్రోత్సహించడాని కి తామెప్పుడూ సిద్ధంగా ఉంటామని, స్టేడియంలో వసతుల కల్పనకు ఎన్ని నిధులైనా వెచ్చిస్తామని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రూ.20 లక్షలతో నిర్మించిన హాకీ మైదానాన్ని ఆదివారం ఆ యన ప్రారంభించారు. స్టేడియంలో హాకీ, కబడ్డీతో పాటు ఇతర క్రీడా మైదానాల అభివృద్ధికి మున్సిపాలిటీ నుంచి నిధులు కేటాయించామని పేర్కొన్నారు. అందులో భా గంగా హాకీ మైదానం చుట్టూ ప్రహరీ ఏర్పా టు చేశామని తెలిపారు. త్వరలో మిగతా పనులు పూర్తి చేసి స్టేడియంలో క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తామన్నారు. 2014లో స్పోర్ట్స్ స్కూల్ను తీసుకొచ్చి జిల్లాలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నమన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించిన క్రీడాకారులకు 2 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నదన్నా రు. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడల్లో రాణించేందుకు సాధన చేయాలని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు అజయ్, కౌన్సిలర్ శ్రీలత, జిల్లా యువజన క్రీడల అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు బాలూ రి గోవర్ధన్ రెడ్డి, జిల్లా హాకీ సంఘం కార్యదర్శి పార్థసారథి, వ్యాయామ ఉపాధ్యాయులు దయానంద్ రెడ్డి, హరిచరణ్, సాయికుమార్, రాష్ట్రపాల్ పాల్గొన్నారు.
పట్టణాభివృద్ధే ధ్యేయం..
ఆదిలాబాద్ పట్టణంలోని అన్ని వార్డుల్లోనూ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
భుక్తాపూర్లో సుమారు రూ.71 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలకు ఆయన భూమిపూజ చేశారు. పట్టణంలోని 49 వార్డుల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి దశలవారీగా నిధు లు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్ప టి వరకు వార్డుల్లో రూ.200 కోట్లతో మౌ లిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ము న్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కౌన్సిలర్ బండారి సతీశ్, కౌన్సిలర్లు అజయ్, వెనుగంటి ప్రకాశ్, పందిరి భూమన్న, చంద నర్సింగ్, కస్తాల ప్రేమల పాల్గొన్నారు.