లక్షెట్టిపేట రూరల్, సెప్టెంబర్ 15: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఇంటింటికీ వెళ్లి వివరించాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్న య్య, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని హన్మం తు పల్లె, చందారం, రంగపేట బలరావుపేట గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హన్మంతుపల్లె గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గుంటుక నగేశ్, ప్రధాన కార్యదర్శిగా రేగుంట మల్లేశ్, ఉపాధ్యక్షుడిగా మొమ్మ చుక్కన్న, కాసెట్టి రమేశ్, కార్యదర్శిగా బింగా రాజయ్య, ప్రచార కార్యదర్శిగా ఎండీ. రబీద్, కోశాధికారిగా ఆది శేఖర్, అన్నం వెంకన్న, రేగుంట బాలయ్య, మేడి కొమురయ్య, మేడి యేసయ్య, పూదరి మొండయ్య, పల్లె రమేశ్, ఆకుల చిన్నయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బలరావుపేట గ్రామ కమిటీ అధ్యక్షుడిగా కొట్టే ఓదయ్య, ఉపాధ్యక్షుడిగా పూదరి జీవన్, కార్యదర్శిగా తిరుపతి, కోశాధికారి బిల్ల రామన్న, సభ్యులుగా శ్రీనివాస్, మల్లేశ్, శ్రీకర్ ఎన్నికయ్యారు. రంగపేట గ్రామ అధ్యక్షుడిగా సురకంటి మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండారు సత్యనారాయణ, ఉపాధ్యక్షుడిగా మేడి సతీశ్, యూత్ అధ్యక్షుడిగా తోటపల్లి మహేందర్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శనిగారపు వెంకటేశ్, అక్బర్, సలీం తదితరులు పాల్గొన్నారు.
పడ్తన్పల్లి గ్రామ కమిటీ ఎన్నిక
హాజీపూర్, సెప్టెంబర్ 15 : పడ్తన్పల్లి గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షుడు మొగిళి శ్రీనివాస్ తెలిపారు. గ్రామ అధ్యక్షుడిగా చెరుకు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా అంకం రాజేశ్, కార్యదర్శిగా చిందం ఆంజనేయులు, సంయుక్త కార్యదర్శిగా పెరుగు లక్ష్మణ్, కోశాధికారిగా గొల్ల భూమేశ్, ప్రచార కార్యదర్శిగా శాంతయ్యతో పాటు మరో ముగ్గురిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నట్లు తెలిపారు.
కోటపల్లి మండలంలో..
కోటపల్లి, సెప్టెంబర్ 15 : ఎసన్వాయి, ఎడగట్ట, పిన్నారం గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను టీఆర్ఎస్ మండల నాయకులు మంత్రి రామయ్య ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ గ్రామ కమిటీ, యూత్ కమిటీ, మహిళా కమిటీలను ఎన్నుకున్నట్లు మంత్రి రా మయ్య వివరించారు.
నస్పూర్లో
సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 15 : నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు కమిటీని బుధవారం ఎన్నుకున్నారు. ఎన్నికల ఇన్చార్జిలు మల్లెత్తుల రాజేంద్రపాణి, డీకొండ అన్నయ్య, ఐత శంకర్ ఆధ్వర్యంలో కమిటీలను నియమించారు. టీఆర్ఎస్ వార్డు కమిటీ అధ్యక్షుడిగా గోళ్ల రాజలింగు, ప్రధాన కార్యదర్శిగా రామినేని సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా గడ్డం ముత్తన్న, సంయుక్త కార్యదర్శి సోదరి శంకర్లతో పాటు 13మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు. యూత్ కమిటీ అధ్యక్షుడిగా పోతురాజుల రమేశ్, ప్రధాన కార్యదర్శిగా వంగ వంశీ, ఉపాధ్యక్షులుగా బేర లక్ష్మణ్, బాదవత్ నరేశ్, సంయుక్త కార్యదర్శి నల్లపు ప్రణయ్, మరో 9 మందిని కార్యవర్గ సభ్యులుగా నియమించారు. కమిటీలకు ఎన్నికైన సభ్యులు పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎన్నికల ఇన్చార్జిలు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వంగ తిరుపతి, నాయకులు ఎంబడి స్వామి, తిప్పని రామయ్య, ముత్తె రాజేశం, బాకం నగేశ్, ముక్కెర వెంకటేశ్, తిప్పని తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.