నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని బెల్ తరోడా, మాలేగాం గ్రామాలను కొత్త మండలాలుగా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎమ్మెల్యే విఠల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 15 గ్రామాలను కలిపి మాలేగాం.. 12 గ్రామాలను కలిపి బెల్తరోడాలను మండలాలుగా ఏర్పాటు చేయాలని మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు.
ఎమ్మెల్యే, ప్రజల డిమాండ్ను పరిగణలోకి తీసుకొని మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం బెల్తరోడా, మాలేగాంలను మండలాలుగా ప్రకటిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది.
– భైంసా, అక్టోబర్ 3