జన్నారం, మార్చి 13: దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్ నుంచి డీసీఏం వ్యాన్లో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని జన్నారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు పోలీస్ స్టేషన్ ఎదుట ఉదయం ఈ వ్యాన్ను పట్టుకున్నట్లు ఎస్ఐ సతీశ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం వివరాలు వెల్లడించారు. నెల్కివెంకటాపూర్కు చెందిన శ్రావణ్, ఇంద్రవెల్ల్లి మండలానికి చెందిన సంతోష్ వీటిని వ్యాన్(టీఎస్ 01యూసీ 5722)లో తరలిస్తున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ బియ్యాన్ని రెవెన్యూ అధికారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. వ్యాన్ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.