పెరువుల ధరల పెంపును ఉప సంహరించుకోవాలి
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్
ఇచ్చోడ, జనవరి 14 : ప్రధాని నరేంద్ర మోడీ వ్యాపారులకు లాభం చేకూర్చుతూ రైతులపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ఆరోపించారు. ఇచ్చోడలోని టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి నివాసంలో శుక్రవారం ఎమ్మెల్యే మాట్లాడారు. రైతుబంధు ఆసరాతో కోలుకుంటున్న రైతులను కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరల పెంపుతో నడ్డి విరుస్తున్నదని ధ్వజమెత్తారు. అన్నదాతల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఎరువుల ధరల పెంపును ఉపసంహరించుకోకుంటే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, అరవింద్ స్థాయిని మరిచిపోయి దిగజారుడు వ్యా ఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం..
టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటున్నదని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. మండలంలోని దుబార్పేట్కు చెందిన టీఆర్ఎస్ నాయకురాలు చాహకటి రాధ గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఆమెకు పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో ఎమ్మెల్యే బాపురావ్ శుక్రవారం స్వయంగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి రూ. 2 లక్షల బీమా చెక్కును భర్త చాహకటి రాములుకు అందజేశారు. ఆపద సమయాల్లో కార్యకర్తల కుటుంబాలను ఆదుకోవాలనే సదుద్దేశంతో సీఎం కేసీఆర్ పార్టీ సభ్యులకు బీమా కల్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సమావేశంలో ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, మాజీ ఎంపీపీ డుకురే సుభాష్ పాటిల్, సర్పంచ్ చాహకటి అభిమాన్, నాయకులు మేరా జ్ అహ్మద్, ముస్తాఫా, వెంకటేశ్, రాథోడ్ ప్రవీణ్ కుమార్, గణేశ్, దాసరి భాస్కర్, ఆర్గుల గణేశ్, ఉప్పులేటి రాజేశ్వర్, గైక్వాడ్ గణేశ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
గుడిహత్నూర్,జనవరి14: మండల కేంద్రంలోని జవహర్నగర్ కాలనీకి చెందిన టీఆర్ఎస్ కార్యకర్తలు అర్జునే శంకర్, ముండె బాలాజీ ప్రమాదవశాత్తు మృతి చెందారు. పార్టీ ద్వారా మంజూరైన రూ. 2 లక్షల విలువైన బీమా చెక్కులను బాధిత కుటుంబాలకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్, సర్పంచ్ జాదవ్ సునీత, ఎంపీటీసీ శగీర్ఖాన్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బూర్ల లక్ష్మీనారాయణ, మండలకోఆప్షన్ సభ్యుడు ఎస్కే జమీర్, నాయకులు జాదవ్ రమేశ్, లింగంపెల్లి రాజేశ్వర్, జలంధర్, దోమకొండ సుధాకర్, ఒర్సు మారుతి, వినోద్, సంతోష్గౌడ్, ఆశన్న యాదవ్, తగరే ప్రకాశ్ పాల్గొన్నారు.
కేంద్రం ఆరాచక పాలన
తలమడుగు, జనవరి 14 : కేంద్రంలోని బీజేపీ ఆరాచకపాలన సాగిస్తున్నదని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మండలంలోని సుంకిడిలో శుక్రవారం ఎడ్ల బండ్ల ర్యాలీ నిర్వహించారు. రైతు వేదికలో ఎమ్మెల్యే మాట్లాడారు. బీజేపీ ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచి వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. అనంతరం గ్రామంలోని శ్మశాన వాటికలో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ గెల్ల మహేందర్ యాదవ్, టీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, నాయకులు ఆశన్న యాదవ్, పొచ్చన్న, గోక జీవన్ రెడ్డి, మోట్టె కిరణ్, అబ్దుల్ల, వెంకన్న పాల్గొన్నారు.