బోథ్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలని టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్సింగ్ డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నాయకులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సమయంలో రైతుల ఆదాయాన్ని పెంచుతామని ఇచ్చిన హామీని మరిచి ముంచుతున్నదని ఆరోపించారు. ఎరువుల ధరల పెంపుతో పెట్టుబడి భారం మోపుతున్న బీజేపీ ప్రభుత్వానికి అన్నదాతలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. సమావేశంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాహెర్బిన్సలాం, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు ఎన్ జగన్మోహన్రెడ్డి, సర్పంచ్ జీ సురేందర్యాదవ్, నాయకులు ఎలుక రాజు, అల్లకొండ ప్రశాంత్, నారాయణరెడ్డి, మెడిచెల్మ ప్రవీణ్, ఉమేశ్, రాయలు, రఫి, వాహిద్, నరేందర్, ముత్యం, శ్రీనివాస్ పాల్గొన్నారు.
ధరలు తగ్గించకుంటే ఆందోళన
భీంపూర్, జనవరి 14 : కేంద్రప్రభుత్వం ఎరువుల ధరలు తగ్గించకుంటే ఆందోళన చేపడుతామని జడ్పీటీసీ కుమ్ర సుధాకర్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రసాయన ఎరువుల ధరలు పెంచడంతో దేశ రైతాంగం అయోమయంలో ఉందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య యాదవ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు ఎం అనిల్, గ్రామ అధ్యక్షుడు రాథోడ్ ఉత్తమ్, సర్పంచ్లు మడావి లింబాజీ, పెండెపు కృష్ణయాదవ్ , ఉపసర్పంచ్ రవీందర్, నాయకులు నరేందర్యాదవ్, కల్చాప్యాదవ్, కపిల్, బక్కన్న యాదవ్, రైతులు పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్రం
సిరికొండ, జనవరి 14 : కేంద్రప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని టీఆర్ఎస్ మండల కన్వీనర్ గోర్బండ్ బాలాజీ ఆరోపించారు. మండల కేంద్రంలోని ప్రెస్క్లబ్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతుల ఆదాయం రెట్టింపు చెస్తామన్న కేంద్రం ఎరువుల ధరలను పెంచిందన్నారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలకు సిద్ధం అవుతామని తెలిపారు. సమావేశంలో నాయకులు గంగాధర్, దత్తు, అశోక్, పాల్గొన్నారు.
రైతులపై కేంద్రం కక్షపూరితం
భీంపూర్, జనవరి 14 : రైతులపై కేంద్రప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు తాటిపెల్లి రాజు ఆరోపించారు. తాంసిలో టీఆర్ఎస్ నాయకులు, రైతులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతులపై భారంపడకుండా ఎరువుల ధరలు పెంచే నిర్ణయాన్ని విరిమించుకోవాలని లేకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ అరుణ్కుమార్, నాయకులు కృష్ణ, శ్రీధర్రెడ్డి, మహేందర్, రజనీకాంత్, గంగారాం పాల్గొన్నారు.
ఎరువుల ధరలు తగ్గించకుంటే నిరసన
బజార్హత్నూర్, జనవరి 14: కేంద్ర ప్రభుత్వం ఎరువులు, విత్తనాల ధరలు తగ్గించకుంటే మండల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపడుతారని యువజన సంఘం మండలాధ్యక్షుడు డుబ్బుల చంద్రశేఖర్ అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం ధరలు తగ్గించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఉపసర్పంచ్ చట్ల విలాస్, నాయకులు రాజారాం, భాస్కర్రెడ్డి, నరేశ్, ప్రకాశ్, శ్రీనివాస్, జగదీశ్వర్, సంటెన్న పాల్గొన్నారు.