బోథ్, జనవరి 14: మండలంలో శుక్రవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు. ఇళ్ల ముగింట ముగ్గులు, రేగుపండ్లు, గొబ్బెమ్మలు ఆకట్టుకున్నాయి. అన్నదాతలు తాము పండించిన వరి, కంది, సోయా, జొన్న, మిర్చి పంటల ఆనవాళ్లతో పాటు పశువుల పేడతో తయారు చేసిన బొబ్బెమ్మలను ఉంచి పూజలు చేశారు.
పట్నాపూర్లో ముగ్గుల పోటీలు
పట్నాపూర్లో ఏకలవ్య పౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. సర్పంచ్ పంద్రం సుగుణ విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కోఆర్డినేటర్ మడావి శ్రీనివాస్, గంగామణి, గంగాధర్, జగదీశ్, సుదర్శన్ పాల్గొన్నారు.
మాన్కాపూర్లో…
నార్నూర్, జనవరి 14 : నార్నూర్ మండలం మాన్కాపూర్ గ్రామంలో ఆదివాసులు నవధాన్యాలతో కూడిన పిండి ఇంటింటా సేకరించారు. హనుమాన్ ఆలయ ప్రాగంణంలో పశువుల పేడతో మోతుకు ఆకులపై పెట్టి రొట్టెలు కాల్చారు. గ్రామీణ దేవతలకు నైవేద్యంగా సమర్పించారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేశారు. కార్యక్రమంలో మెస్రం రూప్దేవ్, మెస్రం మోతీరాం, నానాజీ, పాల్గొన్నారు.
ఉట్నూర్, జనవరి14 : మండల కేంద్రంలోని హనుమాన్ ఆలయ ప్రాంగణంలో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిలోసీనియర్ విభాగంలో గాయత్రి, సీతల్, సుకన్య, జూనియర్ విభాగంలో సాత్విక, నేహస్వరాజ్, దివ్యలకు మాజీ ఎమ్మెల్యే రాథోడ్ సుమన్, జడ్పీటీసీ చారులత బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు ప్రకాశ్, రామగిరి శ్రీనివాస్, భీమన్న, శ్రీనివాస్, రాములు, పోశన్న, రమేశ్ పాల్గొన్నారు.
గేర్జంలో..
ఇచ్చోడ, జనవరి 14: గేర్జం గ్రామంలో ఏకలవ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ కనక విజయ, ఏకలవ్య ఫౌండేషన్ ప్రతినిధులు సాధికే హరికృష్ణ, కో-ఆర్డినేటర్ యాదవ్ రాజారాం, అనిల్, సుభాష్ పాల్గొన్నారు.