ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
మాస్కులు పంపిణీ
ఎదులాపురం, జనవరి 14 : కొవిడ్ నిబంధన లు ప్రతి ఒక్కరూ పాటించాలని ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జిల్లా కేంద్రంలోని రైతుబజార్, వినాయక్చౌక్, గాంధీచౌక్, అంబేద్కర్ చౌక్, నేతాజీచౌక్, బస్టాం డ్ ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తున్నారా.. లేదా అని ఆరా తీశారు. మాస్కులు ధరించని వారికి అవగా హన కల్పించారు. ప్రతీ కిరాణ, బట్టల దుకాణా ల్లో శానిటైజేషన్, థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. సరిహద్దులో గల మహా రాష్ట్ర లో ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతు న్నా యని, అక్కడి నుంచి వచ్చే వారిపై ఆప్రమ త్తంగా ఉండాలన్నారు. కాలినడకన వచ్చే వారికి, రైతు బజార్లోని వినియోగదారులు, వ్యాపా రులకు మాస్కులు పంపిణీ చేశారు. వాహనదారులు మాస్కులు ధరించకుంటే అపరాధ రుసుం వసూ లు చేస్తామని తెలిపారు. ఆరోగ్య, పోలీస్, మున్సి పల్, పంచాయతీ, రెవెన్యూ శాఖలు ప్రజల ఆరో గ్యం కోసం నిరంతరం అవసరమైన చర్యలు చేపడుతున్నారని, ప్రభుత్వానికి సహకరించాల న్నారు. ఫ్రంట్ లైన్ వర్కర్లు తప్పని సరిగా బూస్టర్ డోస్ తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట జిల్లా మార్కెటింగ్ అధికారి శ్రీనివాస్, మున్సిపల్ డీఈఈ తిరుపతి, ఎస్ఐలు విష్ణుప్రకాశ్, అబ్దుల్ బాకీ, తదితరులు పాల్గొన్నారు.