మంత్రి అల్లోల చొరవ జిల్లాకేంద్రంలో పూర్తయిన స్థల సేకరణ
ఇటీవలే ఏరియా దవాఖాన అప్గ్రేడ్.. త్వరలోనే 250 పడకలతో అందుబాటులోకి..
ఇప్పటికే అందుతున్న డయాగ్నోస్టిక్, డయాలసిస్ సేవలు
పేదలకు మరింత చేరవుతున్న వైద్యం
నిర్మల్, జనవరి 14(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి. మంత్రి అల్లోల చొరవతో వేగంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. అందుకు సంబంధించి ఇప్పటికే 25 ఎకరాల స్థలాన్ని అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. వచ్చే విద్యాసంవత్సరం నాటికి అనుమతుల ప్రక్రియ పూర్తయ్యే అవకాశమున్నది. ఇటు ఏరియా వైద్యశాలను జిల్లా దవాఖానగా అప్గ్రేడ్ చేసి 250 పడకలతో సిద్ధం చేస్తుండగా, డయాలసిస్, డయాగ్నోస్టిక్ సేవలు కూడా అందుబాటులోకి వచ్చాయి. జిల్లావాసులకు మరింత మెరుగైన వైద్యం అందుతుండగా, సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్మల్ జిల్లావాసుల మెడికల్ కాలేజీ ఏర్పాటు కల ఎట్టకేలకు నెరవేరనున్నది. రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మం త్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఇచ్చిన హామీల్లో భాగంగా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు త్వరలోనే గ్రీన్ సిగ్నల్ రానున్నట్లు తెలిసింది. ఇప్పటికే మెడికల్ కాలేజీ నిర్మాణం కోసం మంత్రి ఆదేశాల మేరకు 25 ఎకరాల స్థలాన్ని జిల్లా అధికారులు సేకరించారు. నిర్మల్ శివారులోని భీమన్న గుట్టపై 20 ఎకరాలు గుట్ట కింది భా గంలో మరో 5 ఎకరాలను రెవెన్యూ శాఖ కేటాయించింది. వాస్తవానికి గతేడాదే మెడికల్ కాలేజీ ఏర్పాటుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) అనుమతి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల జాప్యం జరిగినట్లు తె లిసింది. వచ్చే విద్యా సంవత్సరం వరకు పూర్తి స్థాయి అనుమతులు లభించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ప్రస్తుతమున్న ఏరియాసుపత్రి జిలా ్ల ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయడంతో 250 పడకలను సిద్ధం చేసేందుకు రూ. 31కోట్ల నిధులతో ఆధునిక భవనాలను నిర్మించనున్నారు. మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఇక్కడే నర్సింగ్ కాలేజీ కూడా ఏర్పాటు చేయనున్నారు. కాగా ప్రస్తుతం జిల్లా కేంద్రంలో కొ నసాగుతున్న ఏరియా దవఖానాలో పడకల సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా నూతనంగా డయాగ్నోస్టిక్ సెంటర్తో పాటు డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాటు మల్టీస్పెషాలిటీ వైద్య సేవలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడి ఆసుపత్రిలో పది పడకలతో కూడిన వెంటిలేటర్స్ను కూడా అందుబాటులోకి తెచ్చారు. అలాగే ప్రసూతి దవాఖానలో అప్పుడే పుట్టిన పిల్లలకు అత్యవసర పరిస్థితిలో వినియోగించే ఇంక్యూబెటర్ లాంటి ఆధునిక సదుపాయాలను కూడా సమకూర్చారు. మెడికల్ కాలేజీ ఏర్పాటుతో జిల్లావాసులకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి రానుంది. ఇప్పటి వరకు గుండె, కిడ్నీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరాలజీకి సం బంధించిన అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో లేని కారణంగా మద్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి హైదరాబాద్లోని కార్పొరేట్ దవాఖానలకు వెళ్తున్నారు. ఆధునిక వైద్యం కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు. కొద్ది రోజుల్లోనే నిర్మల్లో మెడికల్ కాలేజీ అందుబాటులోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు ఆధునిక వైద్యం అందనుండే అవకాశం ఉండడంతో జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లా ప్రజలకు ఆధునిక వైద్యం..
నిర్మల్లో మెడికల్ కాలేజీ ఏర్పాటైతే జిల్లా ప్రజలకు అత్యాధునిక వైద్యం అందుబాటులోకి రానున్నది. మెడికల్ కాలేజీ ఏర్పాటు విషయమై ఇప్పటికే సీఎం కేసీఆర్తో పా టు మంత్రి కేటీఆర్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు విన్నవించిన. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో త్వరలోనే మం జూరవుతుందని అనుకుంటున్నా. ఇందు కు అవసరమైన స్థలాన్ని సేకరించాం. జా తీయ మెడికల్ కౌన్సిల్ అనుమతులు ఎన్ఎంసీ అనుమతులు కూడా త్వరలోనే వస్తాయని ఆశిస్తున్నాం. వచ్చే యేడాదిన్నరలోపు భవనం పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.