బోథ్, అక్టోబర్ 13: దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భం గా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్త్తున్నారు. బుధవారం కుంకుమార్చన చేశారు. బోథ్, ధన్నూర్ (బీ), కౌఠ (బీ),కన్గుట్ట, పొచ్చెర, కుచ్లాపూర్, కరత్వాడ, మర్లపెల్లి, సొనాలలో మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఒడిబియ్యం సమర్పించారు. కౌఠ(బీ)లోని నవ దుర్గామండలిలో అమ్మవారికి సహస్ర దీపాలంకరణ చేశారు.
నేరడిగొండ, అక్టోబర్ 13 : మండలంలోని తేజాపూర్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపంలో జడ్పీటీసీ జాదవ్ అనిల్ బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదానంలో పాల్గొన్నారు. మండలంలోని చిన్న బుగ్గారంలో ఎంపీపీ రాథోడ్ సజన్ అమ్మవారికి పూజలు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ సుభాష్, మాజీ సర్పంచ్ రాథోడ్ సకారాం, నాయకులు జాదవ్ గణేశ్, గ్రామ పెద్దలు భూమారెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, అక్టోబర్ 13: మండలకేంద్రంలోని ప్రధాన్ గూడ, ఎస్టీగోండ్కు చెందిన దుర్గామాత మండపాల్లో హోమాలు చేశారు. భక్తులు పాల్గొన్నారు.
భీంపూర్, అక్టోబర్13: భీంపూర్, పిప్పల్కోటి, నిపాని, కరంజి(టీ) తదితర గ్రామాల్లో అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించారు. కరంజి(టీ)లో బుధవారం రాత్రి నుంచి గురువారం తెల్లవారుజాము వరకు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహేంద్రస్వామి నాటక ప్రదర్శన కొనసాగింది. ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్న యువకులను స్థానికులు అభినందించారు. అంతర్గాంలో హోమం నిర్వహిం చారు. సర్పంచ్ బక్కి లలిత, గ్రామస్తులు పాల్గొన్నారు. పిప్పల్కోటి లోని దుర్గామాతను డీసీసీ అధ్యక్షుడు సాజిద్ఖాన్ దర్శించు కున్నారు. ఈ గ్రామంలో హిందూ, ముస్లింలు కలిసి పం డుగలు నిర్వహించుకోవడం అభినందనీయమ న్నారు. దుర్గామాతకు ముస్లింలు పట్టువస్ర్తాలు సమర్పించడం మతసామరస్యానికి ప్రతీక అని కొనియాడారు. నాయ కు లు మల్లేశ్ యాదవ్, శ్రీనివాస్, రసూల్ తదితరులున్నారు.