టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాలాజీ
సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
సిరికొండ, జనవరి 12 : రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాలాజీ పేర్కొన్నారు. మండల కేంద్రంలో బుధవారం రైతుబంధు సంబురాలు నిర్వహించారు. రైతులు, టీఆర్ఎస్ నాయకులు ట్రాకర్లు, ఎడ్ల బండ్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గుడాల రాజారాం మాట్లాడుతూ అన్నదాత కుటుంబానికి భరోసాగా రైతు బంధు, రైతు బీమా పథకాలను ప్రారంభించిందన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు సునీల్, ఎంపీటీసీ సూర్యకాంత్ పాటిల్, గ్రామ అధ్యక్షుడు మల్లేశ్, మాజీ సర్పంచ్ బషీర్, నాయకులు సూర్యకాంత్, గణపతి, అశోక్, గంగాధర్, రైతులు పాల్గొన్నారు.
రైతు బాంధవుడు కేసీఆర్
బజార్హత్నూర్, జనవరి 12: సీఎం కేసీఆర్ రైతు బాంధవుడని, అనేక పథకాలు ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారని యువజన సంఘం మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ పేర్కొన్నారు మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద రైతులు, యువజన సంఘాల సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏడు విడుతలుగా రూ.50వేల కోట్లు రైతుబంధు పథకం ద్వారా అందించినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు రైతులు చనిపోతే రూ.5లక్షలు బీమా సౌకర్యం కల్పించిందని పేర్కొన్నారు. అంతకుముందు రైతు వేదిక వద్ద మహిళలు ముగ్గులు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చట్ల విలాస్, నాయకులు మధుకర్, భగత్ వినోద్, రమణ, రమేశ్, యువజన సంఘం సభ్యులు సుకుమార్, ప్రభాకర్, లింగన్న, రైతులు పాల్గొన్నారు.