సిర్పూర్(యు) ఫిబ్రవరి 9 : మహాగాంవ్లోని సంత్ శ్రీ సూరోజీ బాబా ఆశ్రమం ఆధ్వర్యంలో శనివారం సామూహిక వివాహాలు వైభవంగా జరిపించారు. యేటా మహాశివరాత్రిని పురస్కరించుకొని శ్రీ సంత్ సూరోజీ బాబా ఆశ్రమంలో సామూహిక వివాహాలు జరిపించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగం గా ఈసారి 12 జంటలకు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం పెళ్లిళ్లు జరిపించారు.
ఎమ్మెల్యే కోవ లక్ష్మి, జడ్పీటీసీ అరుణ వధూవరులకు వస్ర్తాలతో పాటు మెట్టెలు, మంగళసూత్రాలు అందజేశారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా వారికి దుస్తులు పంపిణీ చేశారు.
ఎంపీపీ తొడసం భాగ్యలక్ష్మి, వైస్ ఎంపీపీ ఆత్రం ప్రకాశ్, సింగిల్ విండో చైర్మన్ కేంద్రె శివాజీ, జిల్లా గ్రాంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనక యాదవ్రావ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆత్రం భగవంత్రావు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ సెడ్మకి సీతారాం, మాజీ సర్పంచు ఆత్రం పద్మబాయి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తొడసం ధర్మారావ్, నాయకులు ఆత్రం కిషన్ మహారాజ్, కుమ్ర దేవ్రావ్ మహారాజ్, ఆత్రం భీంరావ్, సురోజీ బాబా ఆశ్రమ కమిటీ సభ్యులు మెస్రం భూపతి, ఆత్రం రాజేశ్వర్, ఆత్రం ఆనంద్రావ్ హాజరై వధూవరులను ఆశీర్వదించారు. మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో అన్నదానం చేశారు.