నిర్మానుష్యంగా మారిన బొగ్గుబాయిలు, ఓసీపీలు
కేంద్రం బొగ్గు బ్లాకుల వేలాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
శ్రీరాంపూర్, డిసెంబర్ 11: సింగరేణిలో 72 గంటల పాటు నిర్వహించిన సమ్మె విజయవంతమైంది. అన్ని కార్మిక సంఘా లు ఐక్యంగా ఇచ్చిన పిలుపులో భాగంగా కార్మికులందరూ విధులు బహిష్కరించారు. సింగరేణికి చెందిన నాలుగు బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ ఈ సమ్మెకు దిగగా, అంతా విధులకు దూరంగా ఉన్నారు. సంస్థ ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా కేంద్రం అడుగులు వేస్తున్నదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో కార్మికులకు ఉద్యోగ భద్రత కరువయ్యే అవకాశం ఉందని, సంస్థ మనుగడే కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కోలిండియాలో 6 లక్షల మంది పని చేసిన సంస్థలో ఇప్పుడు 2.8 లక్షల మందికి చేరుకున్నారు. ఔట్ సోర్సింగ్ క్యాప్టీవ్ మైన్స్(కమర్షియల్) పేరిట ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఒక్కొక్కటిగా బహుళ జాతి సంస్థలకు అప్పగిస్తూ కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేస్తున్నది. సింగరేణి సంస్థలో శ్రావణ్పల్లి, సత్తుపల్లి, కేటీకే 6, కేకే బొగ్గు బ్లాకులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడానికి ఈ నెల 13న వేలం వేయడానికి నిర్ణయించింది.
ఆఖరి రోజూ..
మూడు రోజుల సమ్మెలో భాగంగా ఆఖరిరోజు శనివారం కా ర్మికులంతా విధులకు దూరంగా ఉన్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని 3 డివిజన్లలో ఉత్పత్తి నిలిచిపోయింది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం టీబీజీకేఎస్, ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ కార్మిక సం ఘాలతో పాటు విప్లవ కార్మిక సంఘాలు ఐఎఫ్టీయూ, ఏఐఎఫ్టీయూ తదితర కార్మిక సంఘాలు కూడా గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సమ్మెలో పాల్గొన్నాయి. బెల్లంపల్లి డోర్లి, మందమర్రి, కాసిపేట, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్, ఇందా రం ఏరియాల్లోని గనులు, ఓసీపీల్లో కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో సంస్థకు ఉత్పత్తి నిలిచి పోయింది. సింగరేణి వ్యాప్తంగా రోజుకు 1.50 లక్షల చొప్పున 3 రోజుల్లో 4.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. శ్రీరాంపూర్ ఏరియాలో 3 రోజుల్లో 66,000 టన్నుల ఉత్పత్తి నిలిచింది. బెల్లంపల్లి ఏరియాలోని డోర్లి, ఖైరీగూడ ఓసీపీల్లో 36,000 టన్నులు, మందమర్రి ఏరియాలోని 6 భూగర్భ గనులు, 2 ఓసీపీల్లో 51,000 వేల ట న్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. తూర్పు జిల్లాలోని గనులు, ఓసీపీల్లో 18,000 మంది కార్మికులు సమ్మెలో పాల్గొని సంపూర్ణంగా విజయవంతం చేశారు. అత్యవసర సిబ్బంది మా త్రమే విధులు నిర్వర్తించారు. శ్రీరాంపూర్లో కార్మికులతో కలిసి మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు ర్యాలీ తీశారు. కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. కేంద్రం వెంటనే వేలం నిర్ణయా న్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. బెల్లంపల్లి రీజయన్లోని శాంతిఖనితో పాటు కాసిపేట, తాండూర్లోని గనుల వద్ద కార్మికుల సమ్మెకు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సంఘీభావం తెలిపారు. నాలుగు బొగ్గు బ్లాకులను సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు.