బోథ్, డిసెంబర్ 11: కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ మంచి వేదిక అని బోథ్ జూనియర్ సివిల్ కోర్టు న్యాయమూర్తి హుస్సేన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని న్యాయస్థానంలో శనివారం లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగకుండా ఉండాలంటే రాజీమార్గం ముఖ్యమని తెలిపారు. లోక్ అదాలత్లో ఇచ్చిన తీర్పు అంతిమమని, అప్పీలుకు కూడా అవకాశం లేదని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇరు వర్గాలు రాజీకి రావడంతో తొమ్మిది కేసులు, బ్యాంకు రుణాలకు సంబంధించి 150 కేసులు పరిష్కరించామని తెలిపారు. కార్యక్రమంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) కే సుభాష్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వామన్రావ్ దేశ్పాండే, కార్యదర్శులు పంద్రం శంకర్, న్యాయవాదులు మోహన్రావ్, అంగద్కేంద్రే, ఆడెపు హరీశ్, విజయ్, పోలీసు, కోర్టు సిబ్బంది, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
రాజీ మార్గమే ఉత్తమం
ఉట్నూర్, డిసెంబర్ 11: చిన్నచిన్న కేసులలో రాజీమార్గంతోనే పరిష్కారామవుతాయని ఉట్నూర్ జూనియర్ సివిల్ కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి యశ్వంత్ చౌహాన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో లోక్ అదాలత్ నిర్వహించారు. 983 కేసులు పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన తప్పుల ద్వారా జీవితాంతం బాధపడే అవకాశాలుంటాయన్నారు. సాధ్యమైనంత వరకు రాజీమార్గంతోనే కేసులు పరిష్కారం చేసుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ శేఖర్రెడ్డి, న్యాయవాదులు జమీర్ఖాన్, బాపురెడ్డి, జగన్, జైవంత్రావ్, సిబ్బంది పాల్గొన్నారు.