ఓల్డ్ సాంవ్లి సుద్దవాగుపై వంతెన నిర్మాణం
ఎమ్మెల్యే విఠల్రెడ్డి చొరవ
తీరిన రైతుల కష్టాలు
హర్షం వ్యక్తం చేస్తున్న ఐదు గ్రామాల ప్రజలు
కుభీర్, డిసెంబర్ 11 : అరవయ్యేళ్ల కల నెరవేరింది. ఓల్డ్ సాంవ్లి సుద్దవాగుపై వంతెన నిర్మాణంతో రైతుల కష్టాలు గట్టెక్కాయి. దశాబ్దాల కాలంగా కల్వర్టు నిర్మాణం లేక పోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఓల్డ్ సాంవ్లి, న్యూ సాంవ్లి, వాయి, కుంభి, మొల గ్రామాల రైతులకు సుమారు వెయ్యి ఎకరాలకు పైగా వ్యవ సాయ భూములు ఉన్నాయి. వీరందరూ తమ పొలాల వద్దకు ఈ వాగు దాటి వెళ్లాల్సి వచ్చేది. వర్షాలు కురిసిన సమయాల్లో పొలం వద్దకు వెళ్లే పరిస్థితి ఉండేది కాదు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తమ గ్రామానికి చెందిన రైతుబిడ్డ రేకుల గంగా చరణ్ కుభీర్ సహకార సంఘం చైర్మన్గానే కాకుం డా రాష్ట్ర మార్క్ఫెడ్ డైరెక్టర్గా ఎమ్మెల్యే విఠల్రెడ్డి కృషితో ఎన్నికయ్యారు. దీంతో న్యూ ఓల్డ్ సాంవ్లి గ్రామాల రైతులతో కలిసి ఎమ్మెల్యే నివాసానికి వెళ్లి పరిస్థితిని, రైతులు పడే బాధలు ఆయనకు వివరించారు. దీంతో ఆయన సాంవ్లి నుంచి అమ్రు సాబ్ పహాడ్ వరకు రోడ్డుతో పాటు వంతె న నిర్మాణానికి ఎస్డీఎఫ్ నిధులు రూ.65 లక్షలు మంజూరు చేయించారు. 2020, జూన్ 6న ఆ గ్రామాల ప్రజలతో కలిసి నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఫార్మేషన్ రోడ్డు, వంతెన నిర్మాణం పూర్తి కావడంతో రైతుల ఆనందానికి అవధుల్లేవు. ఈయేడాది వంతెన, రోడ్డు పై నుంచి వెళ్తూ, గుండా తమ పొలాలకు వెళ్లి పనులు చేసు కుని మంచి పంట దిగుబడులు సాధించామని రైతులు పేర్కొంటున్నారు.
వంతెన నిర్మాణం చూస్తాననుకోలేదు..
నాకు ఊహ తెలిసిన నుంచి ఈవాగు దాటి పొలం వద్దకు వెళ్లి వ్యవసాయం చేసుకుంటు న్నాం. చాలా సార్లు వాగు దాటనీయకుంటే పస్తులుండి చేనులోనే నిద్ర లేకుండా గడిపాం. ఎన్నో కష్టాలు పడ్డాం. నా జీవిత కాలంలో ఈవంతెన నిర్మాణం చూస్తానని అనుకోలేదు. మాఇబ్బందులు చూసి వంతెన నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే విఠల్రెడ్డికి ఏమిచ్చి రుణం తీర్చుకునేది. ఎల్లకాలం రైతులందరం రుణపడి ఉంటాం.
ఎమ్మెల్యే కృషి అభినందనీయం..
రైతుల కష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఎమ్మె ల్యే విఠల్రెడ్డి గ్రామం నుంచి అమ్రు సాబ్ పహా డ్ వరకు రోడ్డు కల్వర్టు నిర్మాణానికి ఎస్ఎఫ్డీ నిధులు రూ. 65లక్షలు మంజూరు చేయించా రు. పనులు పూర్తయ్యాయి. రైతుల కష్టాలు తీరినయ్. ఎందరో నాయకులు వచ్చారు కానీ ఈసమస్యను ఎవరూ పట్టించు కోలేదు. సమ స్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు ఈ గ్రామాల ప్రజలు రుణపడి ఉంటారు.