సరస్వతీ విద్యాపీఠం క్షేత్ర అధ్యక్షుడు చామర్తి ఉమా మహేశ్వర రావ్
నూతన విద్యావిధానంపై సెమినార్
ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 11: దేశ పూర్వపు చరిత్రను నేటి తరం యువతకు తెలి యజేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని శ్రీ సరస్వతి విద్యాపీఠం క్షేత్ర అధ్యక్షుడు, రిటైర్డ్ ఐఏఎస్ చామర్తి ఉమా మహేశ్వర రావ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డులో గల శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో శనివారం నూతన విద్యావిధానంపై సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విద్యార్థులకు చదువేకాకుండా వారికి నూతన విద్యావిధానంలో మన సంస్కృతీ ప్రతి బింబించేలా పాఠ్యాంశాలు ఉండాలన్నారు. భార తీయ సంస్కృతీ గొప్పతనం నేటి విద్యార్థులకు చిన్నతనం నుంచే అందించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో ప్రాంత సంఘటన కార్యదర్శి శ్రీని అప్పారావ్, విభాగ్ కార్యదర్శి నాగాచారి, నిర్మల్ జిల్లా అధ్యక్షుడు కిషన్, ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి నిమ్మల ప్రతాప్రెడ్డి, వేణుమాధవ్, గంగారెడ్డి, ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.