ఉట్నూర్ రూరల్, నవంబర్11: పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనక రాజు గురువారం ఉట్నూర్కు చేరుకున్నారు. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంకిత్ ఆయనను కుమ్రం భీం కాంప్లెక్స్లో సన్మానించారు. అనంతరం భీం విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్రం ఈశ్వరీబాయి, ఆదివాసీ నాయకులు వెడ్మబొజ్జు, ఆత్రం భుజంగరావు, సుగుణ, కనక వెంకటేశ్, భాగ్యలక్ష్మి, రాహుల్ పాల్గొన్నారు.
నేరడిగొండ, నవంబర్ 11 : పద్మశ్రీ అవార్డు గ్రహీత గుస్సాడీ కనక రాజును మండలంలోని యాపల్గూడలో గురువారం సన్మానించారు. ముందుగా ఆదివాసీ నాయకులు, గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. భీం విగ్రహానికి కనకరాజు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేశ్, బోథ్ డివిజన్ అధ్యక్షుడు తొడసం శంకర్, మండల అధ్యక్షుడు జుగ్నాక్ సంబన్న, సర్పంచ్ అర్క హంసబాయి, పటేల్ అర్క యాదవరావ్, దేవరి ఆత్రం లింగు, నాయకులు రాములు, రాఘవులు, గ్రామస్తులు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్, నవంబర్ 11: మండల కేంద్రానికి చేరుకున్న గుస్సాడీ కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత కనక రాజుకు ఆదివాసీ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు ఘనస్వాగతం పలికారు. పద్మశ్రీ అవార్డు అందుకొని స్వగ్రామానికి వెళ్తుండగా మండల కేంద్రంలో ఆదివాసీ నాయకులు ఆయనను సన్మానించారు. ముందుగా ఆయన కుమ్రం భీం, అంబేద్కర్ విగ్రహాలకు పూల మాలలు వేశారు. కార్యక్రమంలో కామధేను గోశాల వ్యవస్థాపకుడు, హిందూ వాహిని జిల్లా అధ్యక్షుడు ఆర్యన్ మహారాజ్, సార్మేడి పెందూర్ మారుతి, తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేశ్, ఆత్రం భుజంగరావ్, మండల అధ్యక్షుడు మెస్రం నాగనాథ్ పాల్గొన్నారు.
ఇచ్చోడ, నవంబర్ 11 : పద్మశ్రీ అవార్డు గ్రహీత, గుస్సాడీ కనక రాజును ఇచ్చోడలోని కుమ్రంభీం కాంప్లెక్స్ కార్యాలయంలో ఆదివాసీ సంఘాలు, వివిధ పార్టీల నాయకులు గురువారం సత్కరించారు. న్యూ ఢిల్లీలో పద్మశ్రీ అవార్డు అందుకుని, స్వగ్రామం మార్లవాయికి వెళ్తున్న క్రమంలో ఇచ్చోడలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తన కళను గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేశ్, మండల అధ్యక్షుడు ఆత్రం మహేందర్, ఆదివాసీ సేన జిల్లా కోశాధికారి పెందూరు కేశవ్, సిడాం మురళీకృష్ణ, మెస్రం దేవ్రావ్, మడావి రాములు, జంగు, కొల్లూరి చంద్రశేఖర్, మాధవ్రావ్ ఆమ్టే, కదం బాబరావ్ పాల్గొన్నారు.