మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
సీసీ నస్పూర్, జనవరి 11: ప్రభుత్వం ఎస్పీ కార్పొరేషన్ ద్వారా అందిస్తున్న సబ్సిడీ రుణాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. మంగళవారం నస్పూర్ తహసీల్దార్ కార్యాలయం వద్ద 8 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున మంజూరైన సబ్సిడీ రుణాలకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేశారు. అదే విధంగా 10 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
డ్రైనేజీల నిర్మాణం ప్రారంభం
నస్పూర్ మున్సిపాలిటీలో పరిధిలోని 1వ వార్డులో వేంకటేశ్వర ఆలయం ఎదుట ఉన్న ఒడ్డెరకాలనీ నుంచి సుందరయ్యకాలనీ వరకు రూ.10 లక్షల ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో నిర్మించిన డ్రైనేజీని ఎమ్మెల్యే ప్రారంభించారు. సింగరేణి, మున్సిపల్ నిధులతో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, వైస్ చైర్మన్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ రాజలింగు, తహసీల్దార్ జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గాప్రసాద్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, కౌన్సిలర్లు వంగ తిరుపతి, బోయ మల్లయ్య, బేర సత్యనారాయణ, బండి పద్మ, జబిన్హైమద్, పూదరి కుమార్, కోఆప్షన్ సభ్యుడు నాసర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, నాయకులు మల్లెత్తుల రాజేంద్రపాణి, గర్శె రామస్వామి, ధర్ని మధు, ఏనుగు రవీందర్రెడ్డి, మోతె కనుకయ్య, జక్కుల రాజేశం, చెల్ల విక్రం, జాడి భానుచందర్, దగ్గుల మధు, గర్శె భీమయ్య, కాటం రాజు, రౌతు రజిత, కమలాకర్రావు, మెరుగు పవన్కుమార్, బండి రమేశ్, ఆకునూరి సంపత్కుమార్, మోతె కనుకయ్య, తిప్పని రామయ్య, పంబాల ఎర్రయ్య, రౌతు శ్రీనివాస్, నాగరాజు, సిరిపురం రవి, తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సంక్షేమానికి కృషి
మంచిర్యాలటౌన్, జనవరి 11: పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి మున్సిపల్ పాలకవర్గం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యేదివాకర్రావు అన్నారు. మంగళవారం మంచిర్యాల మున్సిపాలిటీలోని పారిశుధ్య కార్మికులకు సబ్బు లు, నూనెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, కమిషనర్ బాలకృష్ణ, ఎస్ఈ సునీల్రాథోడ్, కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులున్నారు.