మిశ్రమ బంగారం 232గ్రాములు, మిశ్రమ వెండి 4.600 కిలోలు
బాసర, జనవరి 11 : నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. ఆలయ చైర్మన్ శరత్పాఠక్ ఆధ్వర్యంలో ఆలయాధికా రులు హుండీ లెక్కింపు చేపట్టారు. 63 రోజులకు గాను రూ. 78,24,281 నగదు, మిశ్రమ బంగారం 232గ్రాములు, మిశ్రమ వెండి 4.600 కిలోలు, 29 విదేశీ కరెన్సీ నోట్లు సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. హుండీ లెక్కింపులో శ్రీ జ్ఞాన సరస్వతీ సేవా సమితి సభ్యులు, రాజరాజేశ్వరీ సేవా సమితి కామారెడ్డి జిల్లా, సిరిసిల్ల జిల్లా సభ్యులు, దేవస్థాన సిబ్బంది, బ్యాంకు సిబ్బంది, ఆలయాధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.