ఖానాపూర్ టౌన్, డిసెంబర్ 10: పట్టణంలోని శివాజీనగర్లో శ్రీ మహాలక్ష్మీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవాలు నాలుగు రోజులుగా వైభవంగా సాగుతున్నాయి. శుక్రవారం వేదపండితుల మంత్రోచ్ఛరణలతో అమ్మవారి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ముందుగా అమ్మవారి మూల విరాట్టుతో పట్టణంలో శోభాయాత్ర నిర్వహించారు. పోతరాజుల విన్యాసాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు ఐశ్వర్య చండీయాగం, దిగ్భలి, పూర్ణాహుతి, అమ్మవారి విశ్వరూప సందర్శన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమం లో అర్చకులు పాలెం మనోహర శర్మ, పిసుపాటి పాపారావు, కృష్ణ ప్రసాదశర్మ, రేవంత్ శర్మ, నాయకులు బక్కశెట్టి లక్ష్మణ్, ఆకుల శ్రీనివాస్, కిశోర్, వెంకటప్పయ్య, రాజేందర్, నర్సయ్య, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో వివిధ గ్రామాల భక్తులు పాల్గొన్నారు.