డీఆర్డీవో విజయలక్ష్మి
సూపర్ వైజర్లతో సమావేశం
నిర్మల్టౌన్, జనవరి 10 : నిర్మల్ జిల్లాలో అంగన్వాడీలను బలోపేతం చేసి గర్భిణులు, పిల్లలకు
పోషకాహారం అందించాలని, అంగన్వాడీ సెంటర్లలో విద్యార్థుల సంఖ్య పెంచాలని డీఆర్డీవో, శిశు సంక్షేమశాఖ జిల్లా ఇన్చార్జి అధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని శిశు సంక్షేమశాఖ కార్యాలంయలో ఐసీడీఎస్ సూపర్వైజర్లతో సోమవారం ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో విధులు నిర్వహించే వారు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని సూచించారు. పోషకాహారం అందించాలని తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తేవాలని సూచించారు. స్టాక్ రిజిస్టర్లలో కచ్చితంగా నమోదు చేయాలని తెలిపారు. సిబ్బంది ఎజాజ్ అహ్మద్, మూర్తి, మురళి, సిబ్బంది పాల్గొన్నారు.
పూల మొక్కలకు ప్రాధాన్యమివ్వండి
పూల మొక్కలు నాటిరు.పాధాన్యమివ్వాలని డీఆర్డీవో విజయలక్ష్మి పేర్కొన్నారు. సోన్ మండల కేంద్రంతో పాటు కూచన్పెల్లి, న్యూవెల్మల్ బొప్పారం గ్రామంలో హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలపై క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలతో పాటు హరితహారం, బృహత్ పల్లె ప్రకృతివనంలో నాటిన మొక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతిరోజూ నీరు పట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. సర్పంచ్ టీ వినోద్, ఇందూరి రాజేందర్, అంకం గంగామణి, వెంకాయిగారి హరిత, ఎంపీడీవో సాయిరాం, ఈజీఎస్ ఏపీవో మంజుల ఉన్నారు.