సారంగాపూర్, మార్చి 1 : బాలికల భవితకు బాటలు వేసేదుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. అందులో భాగంగా బాల్యవివాహాల వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పిస్తున్నది. అలాగే బాలికా విద్యను ప్రోత్సహిస్తున్నది. వీరికోసం కేజీబీవీలు, గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేసింది. అయినా కొందరు తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను చేర్పించకుండా పెండ్లి చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. బాధ్యత నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. గుట్టుగా వివాహం చేసి సాగనంపుతున్నారు. చిన్నతనంలో పెండ్లి చేయవద్దని, ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని అధికారులు, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు సూచిస్తున్నా.. తల్లిదండ్రుల్లో మార్పురావడం లేదు. జిల్లాలో ఎప్పటి నుంచో ఈ పరంపర కొనసాగుతూనే ఉన్నది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 1098 చైల్డ్లైన్, బాలల సంక్షేమ కమిటీ, బాలరక్షా భవన్, పోలీసు అధికారులు బాల్యవివాహలను అడ్డుకట్ట వేసేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ చిన్నారుల జీవితాలతో చెలగాటమాడొద్దని అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అయినా వివిధ కారణాలను చూపుతూ పెళ్లి చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఈ విషయంలో సామాజిక అంశాలు ప్రభావం చూపుతున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లాలో 2020లో 11.., 2021లో 20.., 2022లో 10 మొత్తంగా మూడేండ్లలో 41 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు.
బాల్య వివాహాలను పోత్సహిస్తే చర్యలు..
గ్రామాలు, పట్టణాల్లో బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. పురోహితులు, హిందు, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు బాల్య వివాహాలు చేస్తే శాఖా పరమైన చర్యలుంటాయి. ఇప్పటికే వీరికి అవగాహన కూడా కల్పించాం. అలాగే గ్రామాల్లో కూడా బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు నిర్వహించి, వాటి మూలంగా వచ్చే అనారోగ్య సమస్యలను ప్రజలకు వివరిస్తున్నాం. – మురళి, డీసీపీవో, నిర్మల్ జిల్లా
ఇలా చేస్తే ప్రయోజనం..