నార్నూర్, డిసెంబర్ 7: కరోనా వైరస్ నివారణకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తహసీల్దార్ దుర్వా లక్ష్మణ్ అన్నారు. నార్నూర్ మండల కేంద్రంతో పాటు తాడిహత్నూర్,రాజుల్గూడ,భీంపూర్ ఎస్సీగూడలోని వ్యాక్సినేషన్ కేంద్రాలను అధికారులు మంగళవారం పరిశీలించారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి టీకాలు వేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రమేశ్, నార్నూర్ మెడికల్ అధికారి విజయ్కుమార్, పీఆర్ ఏఈ జాడి లింగన్న, ఎంపీవో స్వప్నశీల,వైద్య సిబ్బంది ఉన్నారు. మండలంలోని తాడిహత్నూర్ సంతలో రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ అమృత్లాల్ మాట్లాడారు. వైరస్ నివారణకు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు. వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, సర్పంచ్ రాథోడ్ మధుకర్, ఉప సర్పంచ్ ఫడ్ విష్ణు, గిర్దావర్ రాథోడ్ కవిత, పంచాయతీ కార్యదర్శి రాజశేఖర్, గ్రామస్తులు ఉన్నారు.
అప్రమత్తంగా ఉండాలి
బేల, డిసెంబర్ 7 : పక్కనున్న మహారాష్ట్రవాసుల రాకపోకలు అధికంగా ఉన్నందున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేకాధికారి శంకర్ సూచించారు. మండల కేంద్రంతో పాటు మాంగ్రూడ్, కొబ్బయి, గూడ, సాంగిడి, బెదోడ, డోప్టాల తదితర గ్రామాల్లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ను మంగళవారం పరిశీలించారు. మాస్కూలు ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా విధించనున్నట్లు తెలిపారు. మండలంలో 99 శాతం పూర్తయినట్లు పేర్కొన్నారు. ఆయన వెంట ఎంపీడీవో భాగత్ రవీందర్, ఎంపీవో సమీర్ హైమద్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు మంగేశ్ ఠాక్రే, కార్యదర్శులు ఉన్నారు.
అయ్యప్ప దీక్షాపరులకు వ్యాక్సినేషన్
మండలంలోని అయ్యప్ప దీక్షాపరులు కొవిడ్ టీకాలు వేసుకున్నారు. సర్పంచ్ వట్టిపెల్లి ఇంద్రశేఖర్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని అయ్యప్ప సన్నిధానంలో కరోనా వ్యాక్సినేషన్ చేపట్టారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీకాంత్, గంగయ్య, స్వాములు పాల్గొన్నారు.
కొవిడ్ వ్యాక్సిన్పై అవగాహన
బోథ్, డిసెంబర్ 7: మండలంలోని ఘన్పూర్లో మంగళవారం డిప్యూటీ తహసీల్దార్ రాథోడ్ ప్రకాశ్, సొనాల పీహెచ్సీ డాక్టర్ కే నవీన్రెడ్డి ఇంటింటికీ వెళ్లి కొవిడ్ టీకాపై అవగాహన కల్పించారు. పలువురికి టీకాలు వేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జాదవ్ శకుంతల, ఏఎన్ఎం రేణుక, జీపీ కార్యదర్శి మహ్మద్ తమీదుల్లా, గ్రామ నాయక్ రాథోడ్ భగవాన్దాస్ పాల్గొన్నారు.
నేరడిగొండ,డిసెంబర్ 7 : కొవిడ్ వ్యాక్సినేషన్పై నేరడిగొండలో మండల ప్రత్యేకాధికారి రవిశంకర్, డీఎల్పీవో ధర్మారాణి అవగాహన కల్పించారు. వ్యాక్సిన్ వేసుకోని వారి జాబితాను సేకరించాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు సహకరించి వందశాతం పూర్తయ్యేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో అబ్దుల్ సమద్, ఎంపీవో శోభన, సర్పంచ్ పెంట వెంకటరమణ, ఉప సర్పంచ్ దేవేందర్రెడ్డి, నాయకులు సయ్యద్ జహీర్, ఆడెపు రమేశ్, కార్యదర్శి సాయి ఉన్నారు. కుమారిలో వ్యాక్సినేషన్ను తహసీల్దార్ శ్రీదేవి పరిశీలించారు. ఓ వృద్ధురాలికి దగ్గరుండి వ్యాక్సిన్ వేయించారు. ఆమె వెంట సర్పంచ్ రాజు యాదవ్, గిర్దావర్ నాగోరావ్, కార్యదర్శి దయాకర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
తలమడుగు, డిసెంబర్ 7 : మండల కేంద్రంతో పాటు కొత్తూరులో ఇంటింటికీ వెళ్లి కొవిడ్ టీకా వేసుకోని వారిని గుర్తించి వ్యాక్సిన్ వేశారు. కార్యక్రమంలోతహసీల్దార్ ఇమ్రాన్ఖాన్ పాల్గొన్నారు. బరంపూర్, దేవాపూర్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ను ఎంపీడీవో రమాకాంత్, మండల వైద్యాధికారి రాహుల్ పరిశీలించారు. శిబిరాల్లో వైద్య సిబ్బంది, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, డిసెంబర్ 7 : కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జోరుగా కొనసాగుతున్నది. మండలంలోని చించోలి, జామిడి, ఇచ్చోడ, అడెగామ (కే), మాదాపూర్, కేశవపట్నంలో మంగళవారం ఇంటింటికీ వెళ్లి కొవిడ్ టీకాలు వేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ అతిఖొద్ధీన్, ఎంపీడీవో రాంప్రసాద్, ఎంపీవో కొమ్ము రమేశ్, వైద్యాధికారులు సాగర్, హిమబిందు, సర్పంచ్లు, కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.
సిరికొండ, డిసెంబర్ 7: మండల కేంద్రంతో పాటు కన్నాపూర్, కన్నాపూర్ తండా, పిట్టబొంగురం, నర్సాపూర్ పీహెచ్సీ ఆధ్వర్యంలో టీకాలు వేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది సంతోషిణి, విజయ్ కుమార్ పాల్గొన్నారు.