కాసిపేట, అక్టోబర్ 7 : మహిళలు వేధింపులకు గురైతే వెంటనే 100 నంబర్కు డయల్ చేయాలని, హింసించిన వారు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ స్పష్టం చేశారు. గురువారం మందమర్రి సర్కిల్ పరిధిలోని కాసిపేట పోలీస్ స్టేషన్ను ఏసీపీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ ఎడ్ల మహేశ్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలన్నారు. ‘పోలీసులు-మీ కోసం’ కార్యక్రమంలో భాగంగా గ్రామా ల్లో అవగాహన సదస్సులు నిర్వహించి సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలన్నారు. ప్రతి రోజూ తనిఖీ చేయాలని సూచించారు. మందమర్రి సీఐ ప్రమోద్ రావు, కాసిపేట ఎస్ఐ కళ్యాణం నరేశ్ ఉన్నారు.
అభ్యంతరకర పోస్టులు పెడితే చర్యలు తప్పవు
బెల్లంపల్లిటౌన్, అక్టోబర్ 7 : సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ ఎడ్ల మహేశ్ హెచ్చరించారు. గురువారం ఆయన నమస్తేతెలంగాణతో మాట్లాడుతూ బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో మహిళలపై నేరాల నివారణకు మహిళా పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తారని తెలిపారు. భూ కబ్జాలు చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. అర్హత లేని వారు ప్రెస్, పోలీస్ అని వాహనాలకు స్టిక్కర్లు వేసుకున్నా, వాహన ధ్రువీకరణ పత్రాలు లేకున్నా మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇబ్బందులు ఉంటే సెల్ నంబర్ 9440795027ను సంప్రదించాలని సూచించారు.
పేదలకు వైద్య సేవలు అందించడం అభినందనీయం
నిరుపేదలకు ఉచితంగా వైద్యసేవలు అందించడం అభినందనీయమని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేశ్ పేర్కొన్నారు. లయన్స్క్లబ్ మంచిర్యాల, లయన్స్ ఐ దవాఖాన ఆధ్వర్యంలో సీనియర్ లయన్ సభ్యుడు లయన్ వీ మధుసూదన్రెడ్డి సహకారంతో గురువారం లయన్ కంటి దవాఖానలో 42 మందికి కంటి ఆపరేషన్లు చేశారు. అనంతరం వారికి కళ్ల జోళ్లు మందులను ఏసీపీ అందించి మాట్లాడారు. లయన్స్ క్లబ్ సేవలను మరింత మారుమూల గ్రామాలకు విస్తృత పరచాలన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ కంటి దవాఖాన కార్యదర్శి వినోద్, కోశాధికారి వెంకటేశ్వ ర్లు, లయన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షుడు పీ ప్రభాకర్రావు, కార్యదర్శి దామోదర్రావు తదితరులున్నారు.