జడ్పీ చైర్పర్సన్ కోవలక్ష్మి
వేడుకల నిర్వహణపై సమావేశం
హాజరైన కలెక్టర్ రాహుల్రాజ్, ఐటీడీఏ పీవో భవేశ్మిశ్రా
ఆసిఫాబాద్,అక్టోబర్ 5 : కుమ్రం భీం వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. జిల్లాకేంద్రంలోని ఆదివాసీ భవనంలో కలెక్టర్ రాహుల్రాజ్ అధ్యక్షతన సన్మాహక సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ వేడుకలకు 35 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని, సరిపడా ఏర్పాట్లు చేయాలన్నారు. జోడెఘాట్ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అంతకుముం దు భీం మనుమడు సోనేరావు మాట్లాడుతూ నిర్వహణ కమిటీ నియామకం తనకు తెలియకుండా వేశారని ఆగ్రహం వ్యక్తం చేయడంతో కమిటీలో అందరినీ భాగస్వాములను చేయాలని కోవలక్ష్మి సూచించారు.అనంతరం కలెక్టర్ రాహుల్రాజ్ మాట్లాడుతూ జోడెఘాట్లో 50 నుంచి 80 ఎకరాల స్థలంలో జల్ జంగిల్ జమీన్ పేరుతో పార్కు ఏర్పాటు చేయనున్న ట్లు తెలిపారు. దీని కోసం ఇప్పటికే ప్రాజెక్టు త యారు చేసి కేంద్ర టూరిజంశాఖ మంత్రి కిషన్ రెడ్డికి అందజేసినట్లు వివరించారు. ఆదివాసుల సంస్కృతి , సంప్రదాయాలు నృత్య కళా తెలిసేలా వేడుకలను నిర్వహించాలన్నా రు. జోడెఘాట్లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించిన రూ. 48 లక్షల నిధులు త్వరలోనే మంజూరు కానున్నట్లు తెలిపారు.అప్పటివరకు పనులు కొనసాగించేందుకు కలెక్టర్ నిధుల నుంచి రూ. 10 లక్షలు అందజేస్తానని తెలిపారు. వేడుకలకు వచ్చే వారికి మాస్కులు ,శానిటైజర్లు అందజేయా ల ని సూచించారు. సమావేశంలో ఐటీడీవో పీవో భవేశ్ మిశ్రా, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కనక యాదవరావు, కెరమెరి జడ్పీటీసీ ధుర్పతాబాయి, గిరిజన శాఖ డీడీ మణెమ్మ, డీఎస్పీ శ్రీనివాస్, జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.