ఎదులాపురం, డిసెంబర్ 4 : ఒమిక్రాన్ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. ఆదిలాబాద్లోని తిర్పె ల్లి, బడకమొహల్లా, మహాలక్ష్మివాడ, జైజవాన్ నగర్, తాటిగూడ కాలనీలో వ్యాక్సినేషన్ ప్రక్రి యను శనివారం కలెక్టర్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యాక్సిన్పై ఉన్న అపోహలను మున్సిపల్, మెప్మా, వైద్య పం చాయతీ, ప్రత్యేక అధికారులు, స్థానిక ప్రజాప్ర తిని ధులు ప్రజలకు నివృత్తి చేయాలని పేర్కొ న్నారు. జిల్లాలో వందశాతం వ్యాక్సినేషన్ పూర్త య్యేలా జిల్లా యంత్రాంగం సహకరించాలన్నా రు. ఆదిలాబాద్లో అర్హులకు వ్యాక్సిన్ అందిం చాలన్నారు. ప్రతి కాలనీ, ప్రతి సబ్ సెంటర్లో రోజుకూ వంద మందికి వ్యాక్సిన్ అందించాలని అదికారులను అదేశించారు. పదే పదే ఆయా ఇండ్లకు వెళ్లి వ్యాక్సిన్ తీసుకునే వరకు అవగా హన కల్పించాలని పేర్కొన్నారు. ఇందుకు స్థాని కులు, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకో వాల న్నారు. వచ్చే 20 రోజుల్లోగా రోజుకు 20వేల మందికి వ్యాక్సినేషన్ జరిగేలా యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపాలని ఆదేశించారు. ఈ పర్యటణలో మున్సిపల్ కమీషనర్ శైలజ, ప్రత్యేక అధికారులు, మెప్మా, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.