ఎదులాపురం , అక్టోబర్ 4: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా తమ పేర్లు నమోదు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. భారత ఎన్నికల కమిషన్ రూపొందించిన ఓటర్ హెల్ప్లైన్ యాప్ వాల్ పోస్టర్లను కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమ వారం విడుదల చేశారు..ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండిన ఓటరు నమోదు చేసుకోని వారు తమ పేరును ఓటర్ జాబితాలో ఈ యాప్లో ద్వారా చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటర్ హెల్ప్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ యాప్లో ఓటరుకు సంబందించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి , స్వీప్ మెంబర్ ఎన్ భీమ్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షురాలు నలందాప్రియ, మాస్టర్ శిక్షకులు లక్ష్మణ్, సాంకేతిక నిపుణుడు ఉమాకాంత్ పాల్గొన్నారు.
పవర్ గ్రిడ్ తో ఒప్పందం
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పోషకాహార అనుబంధ ఆహారం, ప్రాథమిక కనీస కిట్ల సరఫరాకు పవర్గ్రిడ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. కలెక్టర్ సమావేశ మందిరంలో పవర్గ్రిడ్ సీనియర్ జనరల్ మేనేజర్ (హెచ్ఆర్) జీవీ రావు , నిజామాబాద్ డీజీఎం పీశ్రీధర్, కలెక్టర్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. జిల్లాలోని బోథ్, గుడిహత్నూర్,ఇచ్చోడ, జైనథ్, నేరడిగొండ మండలాల్లోని 160 అంగన్ వాడీ కేంద్రాల్లో 3 నుంచి 6 ఏళ్ల లోపు ఉన్న 3200 మంది పిల్లలకు వేడిగా వండిన చిరు ధాన్యాల భోజనం , ఇప్పపువ్వు లడ్డూలను అనుబంధ పోషకాహారం కింద వారానికి మూడు సార్లు అందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రాథమిక పాఠశాలలకు కనీస కిట్లు , పిల్లలకు ప్రీ స్కూల్ యూనిఫామ్ , అంగన్వాడీ కేంద్రాలకు కనీస కిట్లు అందించచనున్నట్లు తెలిపారు. ముడి పదారాల సరఫరాకు జిల్లాలోని స్థానిక రైతులకు సహజ సేద్యాన్ని ప్రోత్సాహిస్తూ సహకారం తీసుకుంటామని తెలిపారు. జిల్లాలోని ఎంపిక చేసిన ఐదు మండలాల్లోని 160 అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు అనుబంధ పోషకాహారం , ప్రాథమిక కిట్లను కార్పొరేట్ సంస్థల సామాజిక బాధ్యత కింద 99.64 లక్షల రూపాయలతో దక్షిణ ప్రాంతం-1 పవర్ గ్రిడ్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సీనియర్ జనరల్ మేనేజర్ జీవీ రావు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్భాషా షేక్, జిల్లా సంక్షేమ ఆధికారి మిల్కా, పవర్ గ్రిడ్ సంబంధాల అధికారి వీ శ్రీంకాత్ పాల్గొన్నారు.