హాజీపూర్, ఆగస్టు 4 : ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీని సీఎం కేసీఆర్ పెంచారని, ఈ మేరకు ప్రతి ఉద్యోగీ బాధ్యతగా పని చేయాలని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల (టీఎన్జీవో) సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆ సంఘ భవన కార్యాలయంలో అత్యవసర సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ఉద్యోగులకు పీఆర్సీ పెంచినందుకు సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. సంక్షేమ పథకాలను అర్హులకు అందేలా ఉద్యోగులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ వివిధ శాఖలలో విధులను నిర్వహిస్తున్న ప్రతి ఉద్యోగీ టీఎన్జీవోలో సభ్యత్వం తీసుకోవాలని సూచించారు. అనంతరం దేవాదాయ, ధర్మాదాయ శాఖలో విధులను నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు సభ్యత్వ నమోదును నిర్వహించి, సభ్యత్వ రసీదును అందజేశారు. తలసేమియా, సికెల్సెల్ రోగులకు రక్తం అందించేందుకు త్వరలోనే మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భూముల రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, ఫారెస్ట్ ఉద్యోగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు పొన్న మల్లయ్య, జిల్లా కోశాధికారి నడిమెట్ల సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు శ్రీధర్ రాజు, సంయుక్త కార్యదర్శి సునీత, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, కార్యదర్శి ప్రభులింగం, బెల్లంపల్లి యూనిట్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, సభ్యులు సతీశ్, పవన్, మోపిన్, రాజేందర్, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.