
ఉట్నూర్, అక్టోబర్ 3 : ఏజెన్సీలో పోడు భూ ముల సమస్యను ప్రభుత్వం త్వరలోనే పరిష్కరిస్తుందని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అన్నారు. కుమ్రంభీం ప్రాంగణంలోని సమావేశ మందిరంలో ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్గా కనక లక్కేరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు ప్రాంగణంలోని కుమ్రంభీం విగ్రహానికి మాజీ ఎంపీ గోడం నగేశ్ తో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గుస్సాడీలకు ప్రభుత్వం ద్వారా వచ్చిన రూ.10వేల నగదును అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గిరిజనుల అ భ్యున్నతికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. అందులో భాగంగానే అనేక పథకాలు తీసుకొచ్చిందన్నారు. చైర్మన్గా లక్కేరావుకు మరోసారి అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉందన్నారు. మాజీ ఎంపీ నగేశ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రికి గిరిజనుల సమస్యలు తెలుసన్నారు. అందుకే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. ఐటీడీఏ ఏపీవో భీంరావు, నాయకురాలు ఈశ్వరీబాయి, ఎంపీపీ పంద్ర జైవంత్రావు, మెస్రం దుర్గు, మర్సకోల తిరుపతి, దుర్గం శేఖర్, సుమన్బాయి, భూమన్న, మెస్రం మనోహర్, పెందూర్ ప్రభాకర్, బాపురావు, హన్మంత్రావు, దేవ్రావు, తానాజీ, ఆర్సీవో గంగాధర్, భాస్కర్, ఐటీడీఏ అధికారులు, ఏటీడబ్ల్యూఏసీ డైరెక్టర్లు, గిరిజన పెద్దలున్నారు.
చైర్మన్కు శుభాకాంక్షలు తెలిసిన డీఎస్..
ఎదులాపురం, నవంబర్ 3 : ఏటీడబ్ల్యూఏసీ (ఐటీడీఏ, ఉట్నూర్) చైర్మన్గా కనక లక్కేరావు ఉ ట్నూర్ కేబీ కాంప్లెక్లో బాధ్యతలు స్వీకరించ గా.. దుర్గం ట్రస్ట్ చైర్మన్ (డీఎస్) దుర్గం శేఖర్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేశారు. శుభాకాంక్ష లు తెలిపారు. ఆయన వెంట గణేశ్, దేవేందర్, రాఘు, సుధాకర్, రాము, మెహన్ ఉన్నారు.