ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
వాడవాడలా టీఆర్ఎస్ జెండా పండుగ
ఉత్సాహంగా పాల్గొన్న పార్టీ నాయకులు,కార్యకర్తలు
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 2: టీఆర్ఎస్ తొమ్మిది అనుబంధ సంఘాలతో పార్టీని బలోపేతం చేసుకుంటుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కైలాస్నగర్లో గల టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం జెండా పండుగను నిర్వహించారు. తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో తెలంగాణ ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు ఢిల్లీలో పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నామన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్తను అన్ని విధాలుగా ఆదుకుంటున్నామని తెలిపారు. నేటి నుంచి ఈ నెల 12 వరకు పార్టీలో క్రియాశీలక సభ్యత్వాలు నమోదు చేస్తామన్నారు. గ్రామ, మండల, వార్డు, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిటీలను నియమిస్తామని పేర్కొన్నారు. అంతకుముందు డప్పువాయిద్యాలతో పార్టీ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో నాయకులు కస్తాల ప్రేమల, యూనిస్ అక్బాని, అజయ్, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.
బేల, సెప్టెంబర్ 2: జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు గురువారం జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. మండలంలోని గ్రామాల్లో పార్టీ అధ్యక్షులు టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. మణియార్పూర్లో ఎంపీపీ వనిత ఠాక్రే, చంద్పెల్లిలో జడ్పీటీసీ అక్షిత పవార్ టీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, మండలాధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి , నాయకులు కిషన్ వైద్య, రాకేశ్, మహేందర్, సతీశ్, సురేశ్, తదితరులు పాల్గొన్నారు.
తాంసి, సెప్టెంబర్ 2: మండలంలోని కప్పర్ల, జామిడి, హస్నాపూర్, గిరిగాం, ఘోట్కూరి, పొన్నారి, సవర్గాం, లింగూడ గ్రామాల్లో గ్రామ కమిటీ అధ్యక్షులు గులాబీ జెండా ఎగురవేశారు. తాంసిలో మండల కన్వీనర్ పులి నారాయణ జెండా ఎగుర వేశారు. కార్యక్రమంలో ఎంపీపీ సురుకుంటి మంజుల శ్రీధర్రెడ్డి, జడ్పీటీసీ రాజు, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, మాజీఎంపీపీ అరుణ్కుమార్, సర్పంచ్లు కృష్ణ, వెంకన్న, సదానందం, గజానన్, నర్సింగ్, ఎంపీటీసీలు రఘు, అశోక్, నాయకులు గంగారాం, కాంత్రెడ్డి, దయానంద్, పరమేశ్, చంద్రన్న, దేవేందర్, సురేశ్రెడ్డి పాల్గొన్నారు.
ఉట్నూర్, సెప్టెంబర్ 2: మండల కేంద్రంలోని అంబేద్కర్, వినాయక్ చౌక్లో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సింగారే భరత్, పట్టణ అధ్యక్షుడు అన్సారీ పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావు, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ బాలాజీ, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు అహ్మద్ అజీమొద్దీన్, నాయకులు దాసండ్ల ప్రభాకర్, పోశన్న, కందుకూరి రమేశ్, మాజీ సర్పంచ్ బొంత ఆశారెడ్డి, రమేశ్, రాజ్కుమార్, ముజీబ్ఖాన్, సత్తన్న, భూమన్న, రవి, కైసర్ పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ధ్యేయం
ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 2: ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని పీఏసీఎస్ చైర్మన్ మారుతీపటేల్డొంగ్రే, ఏఎంసీ చైర్మన్ రాథోడ్ మోహన్నాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంతో పాటు బిక్కుతండా, కెస్లాపూర్, వాల్గొండ, గౌరాపూర్, పలు గ్రామాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు. జై తెలంగాణ జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ హోరెత్తించారు. మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ తీశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కనక తుకారాం, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, మాజీ ఎంపీటీసీ హనుమంత్రావ్, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు షేక్ సుఫియాన్, గ్రామపటేల్ మెస్రం వెంకట్రావ్పటేల్, సర్పంచ్లు మెస్రం రేణుకానాగ్నాథ్, విజయ, జుగాదిరావ్, నాయకులు దేవ్పూజే మారుతి, తుకారాం, బాబుముండే, శివాజీ, శ్రీనివాస్, హరిదాస్, హనుమంత్రావ్, ఆత్రం ధర్ము, నగేశ్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేద్దాం
నార్నూర్, సెప్టెంబర్ 2: టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేద్దామని పార్టీ మండలాధ్యక్షుడు మెస్రం హన్మంత్రావ్ అన్నారు. మండలంలోని ప్రతి గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
గాదిగూడ, సెప్టెంబర్ 2: మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, నాయకులు గులాబీ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మెస్రం దేవ్రావ్, మాజీ సర్పంచ్ ఆత్రం ఇంద్రబాన్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ కోవ దేవ్రావ్, ఉపసర్పంచ్ సోము, కార్యకర్తలు పాల్గొన్నారు.
అన్ని రంగాల్లో అభివృద్ధి
బోథ్, సెప్టెంబర్ 2: సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా సంక్షేమ పథకాల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఎస్ రుక్మాణ్సింగ్ పేర్కొన్నారు. మండల కేంద్రంతో పాటు పొచ్చెర, ధన్నూర్(బీ), కోటా(కే), పార్డీ (బీ) గ్రామాల్లో టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. నాయకులు పార్టీ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ సంధ్యారాణి, ఆత్మ చైర్మన్ సుభాష్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాహెర్ బిన్ సలాం, సహకార సంఘం చైర్మన్ ప్రశాంత్, నాయకులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, సెప్టెంబర్ 2: దేగామ గ్రామంలో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు భోజారెడ్డి, మండల కన్వీనర్ రాజారాం పార్టీ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వెంకన్న, నాయకులు గణేశ్, సూది వినాయక్, చట్ల ఉత్తమ్, జగదీశ్వర్, విలాస్, గుంజాల భాస్కర్రెడ్డి, పోతన్న, రమణ పాల్గొన్నారు.
ఇచ్చోడ, సెప్టెంబర్ 2: మండలంలోని ముక్రా(కే)లో రైతుల తమ పొలాల్లో గులాబీ జెండాను ఎగుర వేశారు. ఇచ్చోడలోని బస్టాండ్ సమీపంలో మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, గులాబీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ముస్తాఫా, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, మాజీ ఎంపీపీ సుభాష్ పాటిల్, నాయకులు లోక శిరీష్ రెడ్డి, అబ్దుల్ అజీమ్, వెంకటేశ్, రాథోడ్ ప్రకాశ్, గణేశ్, గంగయ్య, ప్రవీణ్, లక్ష్మి పాల్గొన్నారు.
భీంపూర్, సెప్టెంబర్ 2: మండలంలోని 26 గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పార్టీ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ మేకల నాగయ్య, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఎంపీపీ రత్నప్రభ, వైస్ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్లు నిమ్మ వేణు, లలిత, కృష్ణ, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి గ్రామ అధ్యక్షులు, నాయకులు నరేందర్ యాదవ్, మర్ల వినోద్ యాదవ్, మాద సురేశ్, విఠల్, నితిన్, రాథోడ్ ఉత్తమ్, నరేందర్రెడ్డి, కపిల్యాదవ్, పెంటపర్తి లస్మన్న, రెడ్డి సుభాష్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
నేరడిగొండ, సెప్టెంబర్ 2: మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ శివారెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రాథోడ్ సజన్, జడ్పీటీసీ జాదవ్ అనిల్, ఏఎంసీ చైర్మన్ దావుల భోజన్న, వైస్ఎంపీపీ మహేందర్రెడ్డి, సర్పంచ్ వెంకటరమణ, నాయకులు రవీందర్రెడ్డి, జాదవ్ కపిల్, సయ్యద్ జహీర్, మహేందర్రెడ్డి, రమేశ్ పాల్గొన్నారు.
సిరికొండ, సెప్టెంబర్ 2: మండల కేంద్రంతో పాటు పొచ్చంపల్లి, సోంపల్లి, రాంపూర్, కొండాపూర్, పొన్న, వాయిపేట్ గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు పార్టీ జెండా ఎగురవేవారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బాలాజీ, గ్రామ అధ్యక్షుడు బియ్యాల మల్లేశ్, నాయకులు బషీర్, అశోక్, గంగాధర్, రాజన్న, సూర్యకాంత్, సునీల్, ప్రహ్లాద్, సర్పంచ్లు పాల్గొన్నారు
గుడిహత్నూర్, సెప్టెంబర్ 2: మండలంలోని ప్రతి గ్రామంలో ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. జెండా ఆవిష్కరణ అనంతరం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మండలాధ్యక్షుడు కరాడ్ బ్రహ్మానంద్ కార్యాలయంలో పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో నాయకులు బూర్ల లక్ష్మీనారాయణ, జాదవ్ రమేశ్, కుమ్మరి సత్యరాజ్, వామన్ గిత్తే, జంగు, ప్రకాశ్, మాధవ్, గుణవంత్రావ్, ప్రతాప్, రాందాస్, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, సెప్టెంబర్ 2: మండలంలోని ఘన్పూర్, దంతన్పల్లి, లక్కారం, బీర్సాయిపేట, శ్యాంపూర్, సాలేవాడ, పులిమడుగు గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జైవంత్రావు, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, వైస్ఎంపీపీ దావులే బాలాజీ, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సింగారే భరత్, సర్పంచ్లు రాథోడ్ జనార్దన్, సరిత. ఉపసర్పంచ్ సత్తన్న, నాయకులు పోశన్న, గంగాధర్, సెడ్మాకి సీతారాం, మహేందర్, మల్లయ్య పాల్గొనారు.
జైనథ్, సెప్టెంబర్ 2: మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల కన్వీనర్ తుమ్మల వెంకట్రెడ్డి పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఎంపీపీ గోవర్ధన్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ విజయ్ కుమార్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ ఎస్ లింగారెడ్డి, జిల్లా డైరెక్టర్ చంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యాదవ్, ఆలయ కమిటీ చైర్మన్ వెంకట్రెడ్డి, నాయకులు వేణు యాదవ్, గణేశ్ యాదవ్, సురేందర్రెడ్డి, తిరుపతి, సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.