తాంసి, డిసెంబర్ 1: మహిళల రక్షణకు షీటీం బృందాలు పని చేస్తాయని ఎస్ఐ ధనశ్రీ అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో షీటీం సభ్యులతో కలిసి బుధవారం విద్యార్థులకు మహిళా చట్టాలు, ఆన్లైన్ మోసాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మహిళలు ఎలాంటి వేధింపులకు గురైన వెంటనే డయల్ 100, దగ్గరలోని పోలీసులను సంప్రదించాలని సూచించారు. యువత ఆన్లైన్ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో షీటీం ఇన్చార్జి సునీత, వనిత, విజయ్కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సంతోష్, అధ్యాపకులు పాల్గొన్నారు.
ఆపదలో అండగా షీటీం
నార్నూర్, డిసెంబర్ 1: ఆపద సమయంలో మహిళలకు షీటీం అండగా ఉంటుందని షీటీం ఇన్చార్జి బాపురావు అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సభ్యులు అశోక్రావు, భాగ్యశ్రీ, ప్రిన్సిపాల్, ఉదయ్ కుమార్, సిబ్బంది వెంకటరమణ, తిరుపతిరెడ్డి, ఉదయ్రెడ్డి, నరేశ్ పాల్గొన్నారు.