ఎదులాపురం, డిసెంబర్ 1 : జాతీయలోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ మంత్రి రామకృష్ణ సునీత పేర్కొన్నారు. బుధవారం జిల్లాకేంద్రంలోని కోర్టు సమావేశ మందిరంలో బ్యాంక్, బీమా సంస్థల అధికారులు న్యాయ వాదులు, పీపీలతో కలిసి సమావేశం నిర్వహించారు. చెక్బౌన్స్, ఇన్స్టాల్మెంట్ కేసుల్లో రాజీ అయ్యే కేసుల వివరాలను జిల్లా ప్రధాన న్యాయమూర్తి బ్యాంకర్లు బీమా సంస్థల ప్రతినిధులు వారి న్యాయవాధుల ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, డీఎల్ఎస్ఏ చైర్పర్సన్ మంత్రి రామకృష్ణ సునీత మాట్లాడుతూ.. ఈ నెల 11న నిర్వహిచి జాతీయ లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. కోర్టుల చుట్టూ ప్రజలు తిరుగుతూ సమయాన్ని వృథా చేసుకోవద్దనే ఉద్దేశంతో పాటు కేసులను త్వరతిగతిన పరిష్కరించేందుకు జాతీయలోక్ అదాలత్ను నిర్వహస్తున్నామన్నారు. ఈ సమావేశంలో సీనియర్ సివిల్ జడ్జి, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్ పాండే, పీపీ రమణారెడ్డి, బ్యాంకర్లు , బీమా సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.