ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
పేదలకు దుప్పట్ల పంపిణీ
ఆదిలాబాద్ రూరల్, జనవరి 1 : పేదలను ఆదుకోవడంలో స్వ చ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు మరిచిపోలేమని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. పీస్ ఫోరం ఆధ్వర్యంలో ఖానాపూర్లోని నిరుపేదలకు శనివారం దుప్పట్లను పంపిణీ చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న చలిని దృష్టిలో పెట్టుకొని నూతన సంవత్సరం సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. స్వ చ్ఛంద సంస్థలు మహిళలు, యువతకు అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి శిక్షణను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పీస్ ఫోరం నిర్వాహకులు సాధు సుందర్, దయానంద్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, వైస్చైర్మన్ జహీర్ రంజానీ, నాయకులు అజయ్, అశోక్స్వామి, సతీశ్, నర్సింగ్ పాల్గొన్నారు.
నాగోబా ఆలయాభివృద్ధికి ప్రత్యేక చర్యలు
ఇంద్రవెల్లి, జనవరి 1 : ఆదివాసీ గిరిజనుల ఆరాధ్య దైవం కెస్లాపూర్ నాగోబా జాతరతో పాటు ఆలయాభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యే క చర్యలు తీసుకుంటున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మండలంలోని కెస్లాపూర్ నాగోబా ఆలయాన్ని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఐటీడీఏ చైర్మన్ కనక లక్కేరావ్తో కలిసి ఎమ్మెల్యే శనివారం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ను శాలువాతో సన్మానించారు. నిర్మాణమవుతున్న నాగోబా ఆలయాన్ని పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో నెలకొన్న నీటి సమస్యను మెస్రం వంశీయులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే.. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈతో ఫోన్లో మాట్లాడిసమస్యను పరిష్కరించాలని సూచించగా.. ఆదివారం వచ్చి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు. నాగోబా జాతరకు ముఖ్యమంత్రి కేసీఆర్ లేదా రాష్ట్ర మంత్రి కేటీఆర్ను తీసుకొచ్చేందుకు ఎమ్మెల్యే రేఖానాయక్తో కలిసి ప్రయత్నం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి రాకపోతే తప్పకుండా మంత్రి కేటీఆర్ని తీసుకొస్తామన్నారు. సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షుడు షేక్ సుఫియాన్, నాగోబా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మెస్రం తుకారాం, టీఆర్ఎస్ నాయకులు కనక హనుమంత్రావ్, కోరెంగా సుంగుపటేల్, మర్సుకోల తిరుపతి, మెస్రం వంశీయులు పాల్గొన్నారు.