ఎదులాపురం, జనవరి 1: నూతన సంవత్సరంలో శాంతి భద్రతలను మరింత కట్టుదిట్టంగా పరిరక్షించడమే లక్ష్యంగా పని చేయాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా పోలీస్ ముఖ్య కార్యాలయంలో శనివారం ఏఎస్పీలు, డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో కలిసి కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆర్థిక నేరాలను కట్టడి చేయడానికి పోలీసులు మరింత శ్రమించాలని పేర్కొన్నారు. మట్కా, గుట్కా, గంజాయి, గుడుంబా తయారీ, తదితర వాటిపై దృష్టి సారించి కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. గ్రామలు, పట్టణల్లో సీసీ కెమెరాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలతో సత్సంబంధాలు మెరగుపరచడానికి గ్రామాల్లో క్రీడలు, వైద్య శిబిరాలు, వృద్ధులకు, పేద ప్రజలకు సహకారం అందించాలని తెలిపారు. మహిళల భద్రతకు షీటీం బృందాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఉట్నూర్ ఏఎస్పీ హర్షవర్ధన్, డీఎస్పీలు వెంకటేశ్వరరావు, డీఆర్ డీఎస్పీ విజయ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సీఐ కృష్ణమూర్తి, సీఐలు ఎస్ రామకృష్ణ, శ్రీనివాస్, పురుషోత్తమాచారి, గంగాధర్, వెంకటి, గడికొప్పుల వేణు, శ్రీపల్, వంశీకృష్ణ, ఎస్ఐ అన్వర్ ఉల్ హక్, పోలీస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి సత్యనారాయణ, ఎస్పీసీసీ శ్రీనివాస్, ఆదిలాబాద్, ఉట్నూర్ సబ్ డివిజన్ పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.