ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు
ఎదులాపురం, జనవరి 1 : నూతన సంవత్సరం సందర్భంగా తనకు నోట్బుక్లు, పెన్నులు, దుప్పట్లు అందజేసి శుభాకాంక్షలు తెలిపిన వాటిని పేద విద్యార్థులకు పంపిణీ చేస్తానని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా శనివారం జిల్లా క్యాంపు కార్యాలయంలో అదనపు కలెక్టర్, ఆర్డీవో, ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థ, మీడియా ప్రతినిధులు, రాజకీయ నాయకులు, జడ్పీటీసీలు, అధికారులు పెన్నులు, నోట్బుక్లు, దుప్పట్లు కలెక్టర్కు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జడ్పీ, ఆర్డబ్ల్యూఎస్, డీవైఎస్వో, టీఎన్జీవోస్ నాయకులు దుప్పట్లు అందజేశారు.. విద్యాశాఖ అధికారులు, హెచ్డబ్ల్యూవో, నాల్గో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సాజిద్ ఖాన్, నాయకులు నోట్బుక్లు అందజేశారు. అంతకు ముందు క్యాంపు కార్యాలయ సిబ్బందితో కలిసి కేక్ కట్ చేశారు. జిల్లా అధికారులు వెంకటేశ్వర్లు, ఉత్తమ్, కిషన్, భగత్ సునీత, శంకర్, రాజలింగు, పుల్లయ్య, తహసీల్దార్ భోజన్న, డీడీ ప్రవీణ్ కుమార్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అశోక్, నవీన్ కుమా ర్, గంగాధర్, ఓంప్రసాద్, దతు పాల్గొన్నారు.