కుంటాల, జనవరి 1 : టీఆర్ఎస్ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. కుంటాలలోని గజ్జలమ్మ ఆలయ గాలి గోపురం, ప్రహరీ నిర్మాణ పనులకు రూ.32 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. ఆ నిధుల మంజూరు పత్రాన్ని శనివారం గ్రామస్తులకు అందజేశారు. గజ్జలమ్మ దేవీని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాభివృద్ధికి దేవాదాయ శాఖ ద్వారా రూ.25 లక్షలు, జిల్లా పరిషత్ ద్వారా రూ.2.50 లక్షల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో పురాతన దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ప్రాంగణంలో కేక్ కట్ చేశారు.ఎమ్మెల్యేకు స్థానికులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. సర్పంచ్ సమతా వెంకటేశ్, టీఆర్ఎస్ మండలకన్వీనర్ పడకంటి దత్తు. ఆర్బీఎస్ మండల కన్వీనర్ బిల్లోల శంకర్ గౌడ్, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జారాం, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
28 మందికి సీఎంఆర్ఎఫ్ అందజేత..
మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 28 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి మంజూరైంది. ఆ చెక్కులను ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అందజేశారు. వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.