గర్మిళ్ల, నవంబర్ 30 : తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు మంగళవారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో 25 మంది ఆర్టీసీ ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రయాణికులకు సేవలందించడంలో అగ్రగామిగా ఉన్న ఆర్టీసీ రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీమన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భాస్కర్ రావు, వైస్ చైర్మన్ మహేందర్, డాక్టర్ జోగేందర్, ఆర్టీసీ డీఎం మల్లేశయ్య, అసిస్టెంట్ మేనేజర్ శ్రీలత, ఆర్టీసీ హెడ్ కానిస్టేబుల్ సురేందర్ రావు, గ్యారేజ్ సిబ్బంది, ట్రాఫిక్ సూపర్ వైజర్లు, కండక్టర్లు, డ్రైవర్లు పాల్గొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో..
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, నవంబర్ 30 : ఆర్టీసీ ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో డిపొ మేనేజర్ సుగుణాకర్తో పాటు 13 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ దేవపాల, ఎస్ఐ గంగన్న, రెడ్క్రాస్ సొసైటీ సిబ్బంది, ఆర్టీసీ సిబ్బంది తదితరులు ఉన్నారు.