అర్హులందరూ టీకా తీసుకోవాలి
కొవిడ్ నిబంధనలు పాటించాలి
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ
వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష
నిర్మల్ టౌన్, నవంబర్ 30 : జిల్లాలోని అన్ని పీహెచ్సీల్లో నిర్దేశించిన లక్ష్యం మేరకు వందశాతం వ్యాక్సినేషన్ను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ప్రత్యేక వ్యాక్సినేషన్పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటి వరకు మొదటి, రెండో విడుత కింద టీకా తీసుకున్న, ఇప్పటి వరకు వ్యాక్సిన్ తీసుకోలేని వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అందరికీ టీకా ఇప్పించాలని సూచించారు. మూడో దశ కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో జిల్లాలోని ప్రజలను చైతన్యం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానల్లో అనుమానం వచ్చిన వారికి పరీక్షలు చేసి, వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, జిల్లా వైద్యాధికారి ధన్రాజు తదితరులు పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసులను పూర్తిచేయాలి..
జిల్లాలో అట్రాసిటీ యాక్ట్ను పకడ్బందీగా అమలు చేస్తూ బాధిత కుటుంబాలకు అన్ని విధాలా చేయూతనందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో అట్రాసిటీ కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. 2021లో ఇప్పటివరకు నమోదైన, పరిష్కరించాల్సిన, పరిహారం పొందిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులు పరిష్కరించాలని సూచించారు. అట్రాసిటీ కేసు నమోదు విషయంలో పోలీసుశాఖ క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్ధారణ అయిన తర్వాతనే కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఇన్చార్జి ఎస్పీ ప్రవీణ్కుమార్, సంక్షేమశాఖల అధికారులు శ్రీనివాస్రెడ్డి, సృజయ్కుమార్, రాజేశ్వర్గౌడ్, హన్మాండ్లు, స్రవంతి, కోఆర్డినేషన్ సభ్యులు బొడ్డు లక్ష్మణ్, ముడుసు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
దిలావర్పూర్, నర్సాపూర్(జీ) దవాఖానల్లో తనిఖీ..
దిలావర్పూర్, నవంబర్ 30 : దిలావర్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నర్సాపూర్ (జీ) వంద పడకల దవాఖానను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. దవాఖానలోని అన్ని వార్డుల్లో తిరిగి రోగుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి, అవసరమయ్యే మందులు ఉన్నాయా అని వైద్య సిబ్బందితో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరూ విధిగా టీకా తీసుకోవాలని సూచించారు. అన్ని పీహెచ్సీల్లో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని ఆ శాఖ ఇప్పటికే అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ హిమబిందు, ఆరోగ్య కేంద్రం వైద్యులు శ్యామ్కుమార్, ఆర్ఐ సంతోష్కుమార్ ఉన్నారు.
కుభీర్లోని బీసీ కాలనీలో ఇంటింటా ఆరా..
కుభీర్, నవంబర్ 30 : మండలకేంద్రంలోని బీసీ కాలనీలో కలెక్టర్ ఇంటింటా తిరిగారు. కొవిడ్ వ్యాక్సిన్పై ఉన్న అపోహలను నివృత్తి చేశారు. ముందుగా సర్పంచ్ పీ మీరా విజయ్కుమార్, వైద్యుడు జైనొద్దీన్, ఆరోగ్యశాఖ సిబ్బందితో కలిసి గల్లీల్లో కాలినడకన పర్యటిస్తూ వ్యాక్సినేషన్పై ఆరా తీశారు. మూడో ముప్పు దరిచేరకుండా ఉండాలంటే అందరూ తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఎంపీడీవో రమేశ్, ఎంపీవో గోవర్ధన్, సూపర్వైజర్లు శ్రీనివాస్, సాయిబాబా, కుభీర్ జేపీఎస్ సాయినాథ్, స్టాఫ్ నర్సు సీమ ఉన్నారు.
భైంసా పట్టణంలో..
భైంసా, నవంబర్ 30 : స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏరియాలో కలెక్టర్ ఇంటింటా తిరుగుతూ వ్యాక్సినేషన్పై ఆరా తీశారు. డిప్యూటీ డీఎంహెచ్వో అశిష్ రెడ్డి, తహసీల్దార్ విశ్వంబర్, ఆర్ఐ ప్రవీణ్కుమార్, హెల్త్ సూపర్వైజర్ ఖలీం, మతి న్, ఎంపీడీవో గంగాధర్, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.