బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ షాహీద్
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 30: ఆశ్రమోన్నత పాఠశాలలో దెయ్యం ఉందనే అపోహలను విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని బాలల హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎండీ షాహీద్ అన్నారు. మండలంలోని మామిడిగూడ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలను మంగళవారం జిల్లా బాలల హక్కుల పరిరక్షణ సమితి సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామస్తులు, తల్లిదండ్రులు విద్యార్థులకు ఉన్న అపోహలను దూరం చేసి పాఠశాలకు వచ్చేలా చూడాలన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తరాజ్, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివరావ్, సర్పంచ్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు శాస్త్రీయంగా ఆలోచించాలి
ఆదిలాబాద్ రూరల్, నవంబర్ 30: విద్యార్థులు శాస్త్రీయంగా ఆలోచించాలని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు బెదుడ్కర్ సంతోష్ కుమార్ అన్నారు. మండలంలోని మామిడిగూడ బాలికల ఆశ్రమోన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు సైన్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దెయ్యాలు, భూతాలు లేవని అది భ్రమతో కూడుకున్న మూఢనమ్మకాలు మాత్రమే అని అన్నారు. కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్, కోశాధికారి కత్తి శ్రీధర్బాబు, మెస్రం రాజు, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.