ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి
నిర్మల్ కలెక్టర్ ముషారఫ్ అలీ
సోన్, జూన్ 30: హరితహారంలో అందరినీ భాగస్వాములను చేయాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. నిర్మల్ మండలంలోని కొండాపూర్ నుంచి రత్నాపూర్కాండ్లీ గ్రామం వరకు నా లుగు కిలోమీటర్ల మేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడేతో క లిసి బుధవారం పరిశీలించారు. జిల్లాలో తెలంగా ణకు హరితహారం కార్యక్రమా న్ని పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మొక్కలు నాటేటప్పుడు తీసుకోవాల్సి న జాగ్రత్తలపై సూచనలు చేశారు. గుం తలను ఎక్కువ లోతులో తవ్వుకోవాలని, ఎత్తైన మొక్కలను ఎంపిక చేసుకొని నాటాలని సూచించారు. కొండాపూర్ గ్రామం వద్ద నాలుగు వరుసల రహదారి మధ్యలో ట్రాక్టర్తో గుంతల ను తవ్వుతుండగా పరిశీలించారు. తహసీల్దార్ సు భాష్చందర్, మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ, డీఈ నాగేశ్వర్రావు, మున్సిపల్ సిబ్బంది నరహ రి, సర్పంచ్ నవాత్ గంగాధర్, రైతు బంధు సమి తి మండల కన్వీనర్ మల్లేశ్, తదితరులున్నారు.
హరితహారానికి సర్వం సిద్ధం
నిర్మల్ టౌన్, జూన్ 30: జిల్లాలో పల్లె, పట్టణ ప్ర గతితో పాటు హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. నిర్మల్ జిల్లాలోని భైంసా, ఖానాపూర్, నిర్మల్ మున్సిపాలిటీతో పాటు 396 గ్రామ పంచాయతీల్లో మొక్కలు అందుబాటులో ఉన్నాయన్నా రు. ఇప్పటికే నిర్మల్ జిల్లాలో పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, రైతు వేదికల్లో ఖాళీ ప్రదేశాలను గుర్తించి గుంతలు తవ్వించినట్లు చెప్పారు. జూలై 1 నుంచి 10 వరకు పది రోజుల పాటు పల్లెల్లో ప రిశుభ్రత కార్యక్రమాలు, మురుగు కాలువల నిర్వహణ, పల్లె, పట్టణ ప్రగతి ద్వారా చేపట్టిన అభివృ ద్ధి కార్యక్రమాలు పూర్తి చేయిస్తామన్నారు. ఈ కా ర్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రత్యేకాధికారులను నియమించినట్లు తెలిపారు.