హరితహారానికి అధికార యంత్రాంగం సన్నద్ధం అవుతున్నది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 50.84 లక్షలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా.. ఇందుకు ప్రతి పంచాయతీలో నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నారు. ఆశించిన స్థాయిలో వానలు కురిస్తే.. వచ్చే నెల రెండో వారం నుంచి మొక్కలు నాటాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం నేటి(సోమవారం) నుంచి మొక్కలు నాటే పనిస్థలాలు గుర్తించడం, గుంతలు తీయడం చేయనున్నారు. ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ ఏర్పాటు చేయనున్నారు. ఈ యేడాది పండ్లనిచ్చేవాటితోపాటు ఆదాయానిచ్చే మొక్కలు నాటడానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కాగా.. మొక్కలు నాటే కార్యక్రమాన్ని గతాని కంటే భిన్నంగా చేపట్టాలని నిర్ణయించారు. నాన్ బెనిఫిషరీ, ఇండివిడ్యువల్ బెనిఫిషరీ విభాగాలుగా విభజించి మొక్కలు నాటనున్నారు.
నిర్మల్, మే 14(నమస్తే తెలంగాణ): తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడుత కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. ఇప్పటి వరకు ఎనిమిది విడుతలు పూర్తి కాగా, ఆయా విడుతల్లో నాటిన మొక్కలతో పల్లెలు, పట్టణాలు పచ్చని వనాలుగా మారాయి. హరితహా రం మొక్కలతో పాటు, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ వనాలతో గ్రామాల్లో పచ్చదనం పరుచుకున్నది. వచ్చే వానకాలంలో నిర్వ హించే తొమ్మిదో విడుత హరితహారంలో భాగంగా మొక్కలు నా టేందుకు అవసరమైన చర్యలను అధికారులు ఇప్పటి నుంచే తీసుకుంటున్నారు. గతంలో మొక్కలు పెంచాలంటే ఇతర రాష్ర్టాల నుంచి మొక్కలను తెప్పించాల్సి వచ్చేది. ఆ తర్వాత మండలానికి ఒక నర్సరీని ఏర్పాటు చేసి, మండల పరిధిలోని అన్ని గ్రామాలకు మొక్కలను పంపిణీ చేసేవారు.
గత నాలుగేళ్లుగా ప్రతి పంచాయతీ పరిధిలో నర్సరీలను ఏర్పాటు చేసి, ఒక్కో నర్సరీలో 10వేలకు పైగా మొక్కలను పెంచుతున్నారు. దీంతో వ్యయ భారంతో పాటు రవాణా తిప్పలు తప్పాయి. ఉపాధి హామీ పథకం నిధులతో రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీగా ఈ నర్సరీలను నిర్వహిస్తున్నది. నర్సరీలను సంరక్షించేందుకు వనసేవకులను నియమించి వేతనాలను చెల్లిస్తున్నది. కాగా గత 8వ విడుత హరితహారంలో భాగంగా ని ర్మల్ జిల్లాలోని అన్ని శాఖల ఆధ్వర్యంలో 44లక్షల 21వేల మొక్కలను నాటడం లక్ష్యం కాగా, జిల్లా యంత్రాంగం 100 శాతం పూ ర్తి చేసింది. ఈ సారి కూడా లక్ష్యాన్ని పూర్తి చేయడానికి అధికారులు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు. ఆశించిన వానలు కురియగానే వచ్చే నెల రెండో వారం నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇందుకోసం ఈ నెల 15 నుంచి మొక్కలు నాటే స్థలాలను గుర్తించి, గుంతలు తీయించాలని నిర్ణయించారు. ఆయా శాఖల ఆధ్వర్యం లో నాటాల్సిన మొక్కల లక్ష్యాలను అటవీశాఖ అధికారులు ఇప్పటికే నిర్దేశించారు. నాటిన ప్రతి మొక్కను కాపాడేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. హరితహారంలో భాగంగా మొ క్కలు నాటేందుకు అవసరమైన గుంతలు తీయడం నుంచి… మొక్కలు నాటే ప్రక్రియ వరకు ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయనున్నారు. కాగా ఈ యేడు కూడా పండ్లతో పాటు ఇతర ఆ దాయాన్నిచ్చే మొక్కలను నాటేందుకు ప్రాధాన్యమివ్వనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదో విడుత తెలంగాణకు హరితహారం కార్యక్రమానికి సన్నద్ధమవుతున్నది. ఇప్పటి వరకు ఆయా విడుతల్లో నాటిన మొక్కలతో పల్లెలు, పట్టణాలు పచ్చని వనాలుగా మారాయి. ఇక వచ్చే వానకాలంలో మరోసారి మొక్కలు నాటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. ఇందుకోసం నర్సరీల్లో ఇప్పటికే మొక్కలను సిద్ధం చేసింది. జూన్లో ప్రారంభమయ్యే ఈ విడుత కోసం అధికార యంత్రాంగం పూర్తి స్థాయి ఏర్పాట్లలో నిమగ్నమైంది
కాగా 9వ విడుత హరితహారం కోసం జిల్లా వ్యాప్తంగా 50.84లక్షల మొక్కలు నాటాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం జిల్లాలోని 396 గ్రామపంచాయతీల పరిధిలో 396 నర్సరీలను ఏర్పాటు చేశారు. ఆయా నర్సరీల్లో 39.60లక్షల మొక్కలను పెంచుతున్నారు. అలాగే నిర్మల్, భైంసా, ఖానాపూర్ మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన నర్సరీల్లో 10 లక్షలకు పైగా మొక్కలను పెంచుతున్నారు. వీటిలో పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలున్నాయి. ఈ సారి లోకల్ సీడ్ కలెక్షన్లో భాగంగా స్థానికంగానే విత్తనాలు సేకరించినట్లు చెబుతున్నారు. చింత, వేప, కానుగ, రావి వంటి నీడనిచ్చే చెట్లతో పాటు నిమ్మ, జామ, స పోటా పండ్లు, ఔషధ మొక్కలను పెంచుతున్నారు.
అలాగే గన్నే రు, గులాబీ, మందార వంటి పూల మొక్కలు అందుబాటులో ఉ న్నాయి. కాగా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో 27లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే జిల్లాలోని 3 మున్సిపాలిటీల్లో 11.50లక్షల మొక్కలు నా టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ఏడాది అటవీశాఖ ఆద్వర్యంలో 5.75లక్షలు, పౌరసరఫరాల శాఖకు 2,300, జిల్లా కో-ఆపరేటివ్ కార్యాలయానికి 5,750, విద్యాశాఖకు 9,200, వి ద్యుత్ శాఖకు 5,750, దేవాదాయ, ఇతర మతాల ప్రార్థనా స్థలా ల్లో 5,750, ఇంజినీరింగ్ శాఖల పరిధిలో 5,750 మొక్కలను నాటాలని టార్గెట్ నిర్దేశించారు. అలాగే ఆబ్కారీ శాఖ ఆధ్వర్యంలో 57,500, మత్స్య శాఖకు 57,500, వైద్యారోగ్య శాఖకు 28,75 0, ఉద్యానవన శాఖకు 1,15,000, ఐసీడీఎస్ 11,500, పరిశ్రమల శాఖకు 5,750, ఇంటర్మీడియట్ బోర్డుకు 11,500, మార్కెటింగ్ శాఖకు 5,750, మైనింగ్ శాఖకు 11,500, మైనార్టీ సంక్షే మ శాఖకు 5,750, జాతీయ రహదారుల సంస్థకు 17,250, పో లీసు శాఖకు 1,72,500, రోడ్లు, భవనాల శాఖకు 11,500, రెవె న్యూ శాఖకు 46,000, గిరిజన సంక్షేమ శాఖకు 5,750, క్రీడలు, యువజనుల సర్వీసు శాఖకు 5,750, పంచాయతీరాజ్ శాఖకు 28,750, నీటిపారుదల శాఖకు 57,500 మొక్కలు నాటనున్నారు. నిర్మల్, భైంసా మున్సిపాలిటీల్లో 4.60 లక్షల చొప్పున, ఖానాపూర్ మున్సిపాలిటీలో 2.30లక్షల మొక్కలు నాటాలని ల క్ష్యంగా పెట్టుకున్నారు.
కాగా ఈ సారి మొక్కలు నాటే కార్యక్రమాన్ని గతానికంటే కొంత భిన్నంగా చేపట్టనున్నారు. నాన్ బెనిఫిషరీ, ఇండివిడ్యువల్ బెనిఫిషరీ విభాగాలుగా విభజించి మొక్కలు నాటనున్నారు. నాన్ బెనిఫిషరీ విభాగంలో పల్లె ప్రకృతి వనాలు, బృహత్ వనాలు, రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్, పాఠశాలు, కమ్యునిటీ హాళ్లు, అటవీ ప్రాంతాల్లో మొక్కలు నాటుతారు. ఆయా చోట్ల నీడనిచ్చే మొక్కలైన వేప, నెమలినారే, మద్ది, రావి మొదలగు వాటితోపా టు ఉసిరి, గుల్మోర్, టెకోమ, కాగితం పూలు తరితర మొక్కలు పెంచుతారు.
ఇదిలా ఉంటే ఇండివిడ్యువల్ బెనిఫిషరీ కింద హరితహారంలో భాగంగా రైతుల భూముల్లో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటిస్తారు. ఎంపిక చేసిన భూముల్లో సదరు రైతుకు లబ్ధి చేకూరేలా మామిడి, బత్తాయి, నిమ్మ, జామ, సపో టా, సీతాఫలం, దానిమ్మ, ఆపిల్బేర్, కొబ్బరి, మునగ, ఆయిల్ పామ్ మొక్కలను నాటిస్తారు. ప్రతి మొక్కకు నెలకు రూ.10 చొ ప్పున నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఇలా మొక్కలు నాటిన రెండేళ్ల వరకు ప్రభుత్వం నిర్వహణ ఖర్చులను కూడా ఇవ్వనుండడంతో రైతులు పెద్ద సంఖ్యలో ముందుకు వచ్చే అవకాశమున్నది.
వచ్చే నెలలో తొమ్మిదో విడుత హరితహారాన్ని జిల్లాలో పకడ్బందీ గా నిర్వహించి విజయవంతం చే సేందుకు కార్యా చరణ రూపొందిం చాం. ఇప్పటికే అన్ని శాఖలకు టా ర్గెట్ను నిర్దేశించాం. ఈ సారి జిల్లా వ్యాప్తంగా 50.84లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెటుకున్నాం. ఈసారి గ్రామ పంచాయ తీల ఆదాయాన్ని పెంచేందుకు సంపద వనాలను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందుకోసం నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఉన్న కాలువ గట్లు, చెరువు గట్లపై పండ్ల మొ క్కలతో పాటు కలప మొక్కలను నాటిస్తాం. అలాగే ప్ర భుత్వ ఖాళీ స్థలాలను గుర్తించి బ్లాక్ ప్లాంటేషన్ కార్యక్ర మాన్ని చే పడుతాం. ఇందులో ఆదాయాన్ని ఇచ్చే తెల్ల ఏరు, మద్ది, తా నికాయ, వేప, అల్లనేరేడు, తుమ్మ, ఇప్ప, నీలగిరి, చింత మొ క్కలను నాటిస్తాం. ఈ మొక్కలు చెట్లుగా ఎదిగిన తర్వాత వ చ్చే ఫలాల ద్వారా పంచాయతీలకు పూర్తి ఆదాయం చే కూరుతుంది.
-కే.విజయలక్ష్మి, జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి