తలమడుగు, ఏప్రిల్ 16 : గిరిజనుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషిచేస్తానని ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా అన్నారు. మండలంలోని లక్ష్మీపూర్ కొలాం గ్రామాన్ని శుక్రవారం ఆయన సందర్శించారు. గ్రామంలోని సమస్యలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో నీటి సమస్య ఉందని, వేసవిలో ఇబ్బంది అవుతున్నదని, మిషన్ భగీరథ నీరు వారానికోసారి వస్తున్నదని పీవో దృష్టికి తీసుకెళ్లారు. నీటి సమస్య ఎలా తీరుతుందని పీవో గ్రామస్తులను అడుగగా, గ్రామ శివారులో బావి తవ్విస్తే పశువులకు, తమకు ఇబ్బంది ఉండదని విన్నవించారు. ఇందుకు స్పందించిన ఆయన, ఐటీడీఏ నిధుల నుంచి బోరు బావి తవ్విస్తామని, త్వరగా పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా పనులకు భూమి పూజ చేశారు. పీవో మాట్లాడుతూ.. అర్హులైన వారికి సబ్సిడీ రుణాలు అందిస్తామన్నారు. మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నీటి సమస్య ఉన్న గ్రామాలను సందర్శించి, పరిష్కరించాలని సూచించారు. వాటర్ డే సందర్భంగా హరితహారం మొక్కలకు నీరు పోశా రు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాధ, ఎంపీపీ కల్యాణం లక్ష్మి, జడ్పీటీసీ గోక గణేశ్ రె డ్డి, ఐటీడీఏ ఏపీవో రమణ, తహసీల్దార్ ఇ మ్రాన్ఖాన్, ఎంపీడీవో రమాకాంత్, ఎం పీవో దిలీప్, గ్రామస్తులు పాల్గొన్నారు.